ఒమన్ ఖర్జూర పండ్ల అమ్మకాలకు ప్రత్యేక స్టోర్లు
- October 24, 2021
ఒమన్: ఒమన్ ఖర్జూర పండ్లకు ఉన్న ప్రత్యేకత తెలిసిందే. అత్యంత క్వాలిటీగా ఉండే ఈ పండ్లను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు మార్కెటింగ్ శాఖ ప్రత్యేకంగా స్టోర్లను ఏర్పాటు చేసింది. ఒమని డేట్స్ పేరుతో ఒమన్ అవెన్యూ మాల్ లో స్పెషల్ అవుట్ లెట్స్ ను స్టార్ట్ చేశారు. అదే విధంగా ఖర్జూర రైతులు, మార్కెటింగ్ చేసే వ్యాపారులు, ప్రాసెసింగ్ యూనిట్లకు సంబంధించి సల్తానటే లో ఏర్పాటు చేసిన ఈవెంట్ లోనూ ప్రత్యేక స్టాల్ ను అందుబాటులో ఉంచారు. ఇందులో డేట్స్ నట్స్, ఖర్జురా జ్యూస్, వెనిగర్ ప్రాడెక్ట్ లను ప్రదర్శనకు పెట్టారు. అక్టోబర్ 31 వరకు ఈ ఈవెంట్ ఉంటుంది. ఒమని డేట్స్ పండించే రైతులను, వ్యాపారులను ప్రోత్సహించేందుకు వ్యవసాయ శాఖ అధికారులు కొన్ని నెలలుగా కృషి చేస్తున్నారు. ఒమని డేట్స్ ప్రత్యేకతకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఏవియేషన్ విద్యార్థులకు అంతర్జాతీయ ఇంటర్న్షిప్ అవకాశం
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్
- పిల్లలను కొట్టొద్దు..పేరెంట్స్ కు దుబాయ్ పోలీసులు సలహా..!!
- 24వేల రవాణా సంస్థలను హెచ్చరించిన TGA..!!
- టూర్ ఆఫ్ ఫ్లాండర్స్ సైక్లిస్టులకు జరిమానాలు..!!
- వదంతులను నమ్మొద్దు..ప్రజలకు క్యాబినెట్ విజ్ఞప్తి..!!
- ఖతార్ లో విద్యాసంస్థల సెలవులు పొడిగింపు..!!









