ఒమన్ ఖర్జూర పండ్ల అమ్మకాలకు ప్రత్యేక స్టోర్లు
- October 24, 2021
ఒమన్: ఒమన్ ఖర్జూర పండ్లకు ఉన్న ప్రత్యేకత తెలిసిందే. అత్యంత క్వాలిటీగా ఉండే ఈ పండ్లను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు మార్కెటింగ్ శాఖ ప్రత్యేకంగా స్టోర్లను ఏర్పాటు చేసింది. ఒమని డేట్స్ పేరుతో ఒమన్ అవెన్యూ మాల్ లో స్పెషల్ అవుట్ లెట్స్ ను స్టార్ట్ చేశారు. అదే విధంగా ఖర్జూర రైతులు, మార్కెటింగ్ చేసే వ్యాపారులు, ప్రాసెసింగ్ యూనిట్లకు సంబంధించి సల్తానటే లో ఏర్పాటు చేసిన ఈవెంట్ లోనూ ప్రత్యేక స్టాల్ ను అందుబాటులో ఉంచారు. ఇందులో డేట్స్ నట్స్, ఖర్జురా జ్యూస్, వెనిగర్ ప్రాడెక్ట్ లను ప్రదర్శనకు పెట్టారు. అక్టోబర్ 31 వరకు ఈ ఈవెంట్ ఉంటుంది. ఒమని డేట్స్ పండించే రైతులను, వ్యాపారులను ప్రోత్సహించేందుకు వ్యవసాయ శాఖ అధికారులు కొన్ని నెలలుగా కృషి చేస్తున్నారు. ఒమని డేట్స్ ప్రత్యేకతకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- వలసదారుల్లో ప్రయాణ భయం…
- రేపటి నుంచి కొత్త UPI రూల్స్! తెలుసుకోండి
- ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్
- బహ్రెయిన్ క్రిమినల్ జస్టిస్ పై యూఏఈ ఆసక్తి..!!
- రియాద్ సీజన్ 2025..11 మిలియన్ల మార్క్ రీచ్..!!
- ఆర్ యూ రెడీ.. న్యూఇయర్ వేడుకలు..ఫుల్ గైడ్..!!
- మస్కట్ కు INSV కౌండిన్య.. చారిత్రాత్మక ప్రయాణం..!!
- కువైట్ లో న్యూ ఇయర్ వేడుకలు..భద్రతా కట్టుదిట్టం..!!
- హోటల్ రూమ్స్ బుకింగ్ లో ఖతార్ రికార్డు..!!
- దుబాయ్: 'మా గల్ఫ్' న్యూస్ న్యూ ఇయర్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి కొలుసు పార్థసారథి







