స్కూల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ పెంచటం పై ప్రభుత్వం ఫోకస్
- October 24, 2021
బహ్రెయిన్: స్కూల్ ఎడ్యుకేషన్ సామర్థ్యాలను పెంపొందించడానికి ఎడ్యుకేషన్ మినిస్ట్రీ సిద్ధమైంది. ఇందులో భాగంగా స్కూల్ ఎడ్యుకేషన్ లోని టీచింగ్, నాన్ టీచింగ్ విభాగాల్లో కొత్త నియామకాలను చేపట్టనున్నట్టు ఎడ్యుకేషన్ మినిస్టర్ డాక్టర్ మజిద్ బిన్ అలీ అల్ నుయిమి చెప్పారు. లైఫ్ క్వాలిటీ, భాషా నైపుణ్యాలు మెరుగుదల, డిజిటల్ ఎంపవర్ మెంట్ స్పెషలిస్ట్స్, సోషల్, హెల్త్, అకాడమిక్ అండ్ ప్రొఫెషనల్ కౌన్సెలర్లు లాంటి కొత్త ఉద్యోగాలను తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు. వీటితో స్కూల్ ఎడ్యుకేషన్ నాణ్యత మెరుగవుతుందని, అలాగే స్కూల్ అనుబంధ వ్యవస్థలు కూడా బలోపేతం అవుతాయన్నారు. మొదటగా షైఖా మోజా బింట్ హమద్ అల్ ఖలీఫా సమగ్ర బాలికల పాఠశాల, రిఫా ఇంటర్మీడియట్ బాలుర పాఠశాల, అల్-ముస్తక్బాల్ ప్రాథమిక బాలికల పాఠశాల, ఉక్బా బిన్ నఫియా ప్రాథమిక బాలుర పాఠశాల.. ఈ నాలుగు పాఠశాలల్లో ప్రయోగాత్మకంగా ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నట్లు మినిస్టర్ తెలిపారు.
తాజా వార్తలు
- వలసదారుల్లో ప్రయాణ భయం…
- రేపటి నుంచి కొత్త UPI రూల్స్! తెలుసుకోండి
- ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్
- బహ్రెయిన్ క్రిమినల్ జస్టిస్ పై యూఏఈ ఆసక్తి..!!
- రియాద్ సీజన్ 2025..11 మిలియన్ల మార్క్ రీచ్..!!
- ఆర్ యూ రెడీ.. న్యూఇయర్ వేడుకలు..ఫుల్ గైడ్..!!
- మస్కట్ కు INSV కౌండిన్య.. చారిత్రాత్మక ప్రయాణం..!!
- కువైట్ లో న్యూ ఇయర్ వేడుకలు..భద్రతా కట్టుదిట్టం..!!
- హోటల్ రూమ్స్ బుకింగ్ లో ఖతార్ రికార్డు..!!
- దుబాయ్: 'మా గల్ఫ్' న్యూస్ న్యూ ఇయర్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి కొలుసు పార్థసారథి







