స్కూల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ పెంచటం పై ప్రభుత్వం ఫోకస్
- October 24, 2021
బహ్రెయిన్: స్కూల్ ఎడ్యుకేషన్ సామర్థ్యాలను పెంపొందించడానికి ఎడ్యుకేషన్ మినిస్ట్రీ సిద్ధమైంది. ఇందులో భాగంగా స్కూల్ ఎడ్యుకేషన్ లోని టీచింగ్, నాన్ టీచింగ్ విభాగాల్లో కొత్త నియామకాలను చేపట్టనున్నట్టు ఎడ్యుకేషన్ మినిస్టర్ డాక్టర్ మజిద్ బిన్ అలీ అల్ నుయిమి చెప్పారు. లైఫ్ క్వాలిటీ, భాషా నైపుణ్యాలు మెరుగుదల, డిజిటల్ ఎంపవర్ మెంట్ స్పెషలిస్ట్స్, సోషల్, హెల్త్, అకాడమిక్ అండ్ ప్రొఫెషనల్ కౌన్సెలర్లు లాంటి కొత్త ఉద్యోగాలను తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు. వీటితో స్కూల్ ఎడ్యుకేషన్ నాణ్యత మెరుగవుతుందని, అలాగే స్కూల్ అనుబంధ వ్యవస్థలు కూడా బలోపేతం అవుతాయన్నారు. మొదటగా షైఖా మోజా బింట్ హమద్ అల్ ఖలీఫా సమగ్ర బాలికల పాఠశాల, రిఫా ఇంటర్మీడియట్ బాలుర పాఠశాల, అల్-ముస్తక్బాల్ ప్రాథమిక బాలికల పాఠశాల, ఉక్బా బిన్ నఫియా ప్రాథమిక బాలుర పాఠశాల.. ఈ నాలుగు పాఠశాలల్లో ప్రయోగాత్మకంగా ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నట్లు మినిస్టర్ తెలిపారు.
తాజా వార్తలు
- నా పేరుతో వచ్చే ఫేస్ బుక్ మెసేజ్ లను నమ్మకండి:సీపీ సజ్జనార్
- భారత క్రికెటర్ శ్రీచరణికి టీటీడీ చైర్మన్ అభినందనలు
- కె ల్యాండ్ టూరిజం, ఎంటర్ టైన్ ప్రాజెక్ట్ లో సందడి..!!
- గాజాపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంయుక్త ప్రకటన..!!
- దుబాయ్ లో స్నేహితుడిని హత్య చేసిన వ్యక్తికి జీవిత ఖైదు..!!
- కొత్త పర్యాటక, సాంస్కృతిక కేంద్రంగా జెడ్డా సెంట్రల్..!!
- ప్రైవేట్ రంగంలో రిటైర్ ఎంప్లాయిస్ కు గుడ్ న్యూస్..!!
- రుస్తాక్లోని తావి అల్-హరా మార్కెట్లో వింటర్ క్రాప్..!!
- లులు గ్రూప్ తిరిగి విజాగ్లో మాల్ ప్రాజెక్ట్ ప్రారంభం, ఏపీ ప్రభుత్వంతో MoU
- జగన్కు చెందిన ఆస్తులపై స్టే కొనసాగాలి







