ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరాం: చంద్రబాబు
- October 25, 2021
అమరావతి: దేశంలో ఎక్కడ డ్రగ్స్, గంజాయి దొరికినా లింక్ ఏపీలో ఉంటుందని... రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా తయారైందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఏపీలో పరిస్థితులపై పార్టీ నేతలతో కలిసి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు కంప్లైంట్ చేశారు. రాష్ట్రపతి పాలన విధించాలని కోరిన ఆయన... 8 పేజీల లేఖను అందించారు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే నంబర్ వన్గా ఉండేదని... ఇప్పుడు డ్రగ్స్లో నెంబర్ వన్గా ఉందన్నారు. టీడీపీ ఆఫీసులు, నేతలపై దాడులు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం కొనసాగుతుందంటూ నిప్పులు చెరిగారు.
రాజ్యాంగ వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తున్నారంటూ మండిపడ్డారు చంద్రబాబు. చరిత్రలో మొదటిసారి రాజ్యాంగ సంస్థలపై దాడులు చేస్తూ.... బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు. అక్రమ కేసులు పెట్టి... ప్రజా ప్రతినిధుల్ని కస్టడీలో కొడుతున్నారని తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడిపై సీబీఐ విచారణ చేయించాలని రాష్ట్రపతిని కోరినట్లు తెలిపారు. టీడీపీ నేతల ఆర్ధిక మూలాలపై దాడులు చేస్తున్నారని చంద్రబాబు ఫైర్ అయ్యారు.
తాజా వార్తలు
- మస్కట్ లో ఏపీ వాసి మృతి
- ఢిల్లీ బాంబు బ్లాస్ట్ విషయంలో మా సాయం అక్కర్లేదు..మార్కో రూబియో
- డబ్ల్యూటిఐటిసి 2025 కౌంట్డౌన్ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
- కువైట్ లో ఇద్దరు భారతీయులు మృతి..!!
- జిసిసి 'వన్-స్టాప్' ట్రావెల్ సిస్టమ్ ప్రారంభం..!!
- రియాద్ లో ఆఫాక్ ఆర్ట్స్ అండ్ కల్చర్ అకాడమీ ప్రారంభం..!!
- ‘వన్ ఓషన్, అవర్ ఫ్యూచర్ ’ గ్రాండ్ సక్సెస్..!!
- ఒమన్ ఎయిర్ కొత్త సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ కంటి సమస్యలపై స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!







