ప్రయాణ ఆంక్షలు ఎత్తివేసిన అమెరికా..!
- October 26, 2021అమెరికా: భారత్పై విధించిన ప్రయాణ ఆంక్షలను అమెరికా ఎత్తివేసింది. భారత్తో పాటు పలు దేశాలపై కూడా ఆంక్షలను ఎత్తివేసిన అమెరికా ప్రభుత్వం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. తాజాగా జారీ చేసిన నిబంధనలు నవంబర్ 8వ తేదీ నుండి అమల్లోకి రానున్నాయి. కరోనా విజృంభణతో గత సంవత్సరం అమెరికా విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అమెరికా ప్రయోజనాల దృష్ట్యా ఆంక్షల్ని సడలిస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. వ్యాక్సిన్ ఆధారిత అంతర్జాతీయ ప్రయాణాల పునరుద్ధరణకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు.
రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్న వారిని నవంబర్ 8 నుంచి అమెరికాలోకి అనుమతించనున్నారు. ప్రయాణికులు విమానం ఎక్కేముందే తమ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లను ఇవ్వాల్సి ఉంటుంది. అమెరికా, డబ్ల్యుహెచ్వో గుర్తించిన వ్యాక్సిన్లు తీసుకున్నవారికి అమెరికాలోకి అనుమతి ఉంటుందని నిబంధనల్లో పేర్కొన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న కూడా కరోనా నెగిటివ్ రిపోర్టు సమర్పించాల్సి ఉంటుంది. అలాగే రెండేళ్ల పిల్లలకు కొవిడ్ టెస్టు అవసరం లేదని నిబంధనల్లో స్పష్టం చేశారు. అలాగే వ్యాక్సినేషన్ రేటు 10 శాతం కంటే తక్కువగా ఉన్న సుమారు 50 దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు సైతం ఆంక్షల నుంచి వెసులుబాటు కల్పించింది. వీరు అమెరికాకు వచ్చిన రెండు నెలల్లోగా వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్