కృష్ణవంశీ సినిమా కోసం ముందుకు వచ్చిన చిరంజీవి
- October 26, 2021
హైదరాబాద్: క్రియేటివ్ దర్శకుడు కృష్ణ వంశీ ప్రస్తుతం తన తదుపరి సినిమా అయిన "రంగమార్తాండ" నిర్మాణాంతర పనులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరాఠీ లో సూపర్ హిట్ అయిన సినిమా "నటసామ్రాట్" కి తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. "రంగమార్తాండ" సినిమాలో ప్రకాష్ రాజ్ మరియు రమ్యకృష్ణ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా ఈ ఏడాది ఆఖరులో విడుదల కానుంది. తాజాగా ఈ చిత్ర డబ్బింగ్ పనులను మొదలు పెట్టారు కృష్ణవంశీ. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి నీ బ్యాగ్రౌండ్ వాయిస్ ఇచ్చేందుకు సంప్రదించగా మెగాస్టార్ కూడా ఒప్పుకున్నారు.
ఈ విషయాన్ని షేర్ చేస్తూ మెగాస్టార్ కి కృతజ్ఞతలు కూడా సోషల్ మీడియా ద్వారా తెలిపారు కృష్ణవంశీ. శివాత్మిక, ఆదర్శ్ బాలకృష్ణ మరియు రాహుల్ సిప్లిగంజ్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కానీ విడుదల తేదీ గురించి మాత్రం అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. మరోవైపు ఈ సినిమా థియేటర్లలో కాకుండా డైరెక్టుగా ఓటీటీ ప్లాట్ఫారం లో విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు పుకార్లు సృష్టిస్తున్నారు కానీ సినిమా థియేటర్లలో మాత్రమే విడుదల అవుతుంది అని దర్శక నిర్మాతలు ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. మరి ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో వేచి చూడాల్సి ఉంది.
తాజా వార్తలు
- మస్కట్లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- త్వరలో ఆటోమేటిక్ వెహికల్ ఇన్ ఫెక్షన్ సెంటర్ ప్రారంభం..!!
- జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- ‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!
- యూఏఈ ప్రవాసిని వరించిన Dh1 మిలియన్ లాటరీ..!!
- ఫోన్పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!