కొత్త ట్రావెల్ ప్రోటోకాల్స్ ప్రకటించిన యూఏఈ
- October 27, 2021
యూఏఈ: కొత్త ట్రావెల్ ప్రోటోకాల్స్ ను యూఏఈ ప్రకటించింది. కొత్త నిబంధనలు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం.. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారు మాత్రమే ప్రయాణించడానికి అనుమతి ఉంది. అయితే అధికారుల నుండి ముందస్తు అనుమతి పొందినట్లయితే UAE దౌత్య కార్యకలాపాలు, రోగులు, మానవతావాద కేసులు, స్కాలర్షిప్లపై విదేశాలలో చదువుతున్న వారు కూడా ప్రయాణించవచ్చు. యూఏఈ వచ్చే ప్రయాణికులు కచ్చితంగా 48 గంటలలోపు నిర్వహించిన QR కోడ్తో ఉన్న COVID-19 PCR నెగిటివ్ సర్టిఫికేట్, ప్రయాణానికి 6 గంటల ముందు రాపిడ్ PCR పరీక్ష నెగిటివ్ సర్టిఫికేట్ సమర్పించాలి. వ్యాక్సిన్ తీసుకున్న ప్రయాణికులు వచ్చిన తర్వాత తప్పనిసరిగా PCR పరీక్ష చేయించుకోవాలి. అలాగే నాల్గవ, ఎనిమిదవ రోజులలో మరో రెండు PCR పరీక్షలు తీసుకోవాలి. టీకాలు తీసుకొని ప్రయాణికులు వచ్చిన తర్వాత తప్పనిసరిగా PCR పరీక్ష చేయించుకోవాలి, 10 రోజులు క్వారంటైన్ ఉండాల్సి ఉంటుంది. అలాగే తొమ్మిదవ రోజున మరొక PCR పరీక్ష చేసుకోవాలి. 70 ఏళ్లు పైబడిన వారు తమ ఆరోగ్యం, భద్రతను దృష్టిలో పెట్టుకొని ప్రయాణాలకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు. ‘Tawajudi’ సర్వీస్ లో రిజిస్ట్రేషన్ అవ్వడం ద్వారా ప్రయాణికులు ప్రోటోకాల్స్ వివరాలను, తమ అర్హతలను చెక్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







