భారత్-యూఏఈ ఫ్లైట్స్ లో కరోనా ఆంక్షలు సడలిస్తాం
- October 28, 2021
యూఏఈ:భారత్ నుంచి యూఏఈ, యూఏఈ నుంచి ఇండియా వెళ్లే విమాన ప్రయాణికులకు భారత విదేశాంగ సహాయ మంత్రి వి. మురళీధరన్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే విమాన ప్రయాణాల్లో కరోనా కారణంగా విధించిన నిబంధనలను సడలిస్తామన్నారు. కోవిడ్ కేసులు భారీగా తగ్గినందున ఆ దిశగా ఆలోచన చేస్తున్నామన్నారు.యూఏఈ లో సిక్త్ మినిస్ట్రీయల్ కన్సల్టేషన్ మీటింగ్ కు అటెండైన తర్వాత ఆయన దుబాయ్ ఎక్స్ పో లో ఇండియన్ పెవిలియన్ ను సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రానున్న రోజుల్లో విమాన ప్రయాణాల్లో ఆంక్షలు తొలగిస్తామన్నారు. అదే విధంగా విదేశాల్లో జాబ్ కోల్పోయిన కార్మికులకు ఉపాధి కల్పించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని మీడియా ఆయనను ప్రశ్నించింది. విదేశాల్లో జాబ్ కోల్పోయిన కార్మికుల డేటాను సేకరించిన వారి స్కిల్ కు తగిన విధంగా దేశంలో ఉపాధి కల్పిస్తామని చెప్పారు. అందుకు తగిన విధంగా పలు కంపెనీలతో కలిసి జాయింట్ ఫ్లాట్ ఫామ్ ఏర్పాటు చేస్తామని అన్నారు.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







