బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహనా క్యాంప్ నిర్వహించిన ఐసిఆర్ఎఫ్
- October 28, 2021
మనామా: ఏడాదిపాటు నిర్వహించే మెగా మెడికల్ క్యాంపులో భాగంగా ఇండియన్ కమ్యూనిటీ రిలీఫ్ ఫండ్ (ఐసిఆర్ఎఫ్), బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహనా క్యాంపుని షిఫా అల్ జజీరా మెడికల్ సెంటర్, మనామాలో ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 90 మంది మహిళలు వైద్య పరీక్షలు మరియు డాక్టర్ కన్సల్టేషన్ కోసం హాజరయ్యారు. ఎంబసీ ఆఫ్ ఇండియా సెకెండ్ సెక్రెటరీ రవిశంకర్ శుక్లా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మెడికల్ బృందాలు, ఐసిఆర్ఎఫ్ వాలంటీర్లు అలాగే పార్టిసిపెంట్లతో ఆయన మాట్లాడారు. అనుమానాస్పదమైన కణితులు కనిపించినా, వాటిని మహిళలు నిర్లక్ష్యం చేస్తుంటారని డాక్టర్ షైని సుసీలన్ చెప్పారు. బ్రెస్ట్ క్యాన్సర్ సకాలంలో గుర్తించగలిగితే నయం చేయవచ్చు. కాగా, ఏడాది పాటు మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం ద్వారా 5000 మందికి పైగా కార్మికులకు వైద్య సహాయం చేయాలన్న లక్ష్యంగా పెట్టుకున్నారు. జనరల్ కన్వీనర్ నాజెర్ మజెరి (32228424), జనరల్ కోఆర్డినేటర్ మురళీ క్రిష్ణన్ (34117864) నెంబర్లలో సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







