భారత్ కరోనా అప్డేట్

- October 29, 2021 , by Maagulf
భారత్ కరోనా అప్డేట్

 న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా కేసులు పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. నిన్న పెరిగిన కరోనా కేసులు ఇవాళ కాస్త తగ్గాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 14,348 మంది కోవిడ్‌బారిన పడ్డారు.. మరో 805 మంది కోవిడ్‌ బాధితులు మృతిచెందారు.. ఇదే సమయంలో 13,198 మంది కోవిడ్‌ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు కేంద్రం పేర్కొంది.

దీంతో.. ఇప్పటి వరకు భారత్ లో నమోదైన కోవిడ్ పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,42,46,157 కు చేరుకోగా. మొత్తం రికవరీ కేసులు 3,36,27,632 కి పెరిగాయి. మరోవైపు.. ఇప్పటి వరకు 1,04,82,00,966 మందికి వ్యాక్సినేషన్‌ జరిగిందని బులెటిన్‌లో పేర్కొంది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక, కరోనాతో మృతిచెందినవారి సంఖ్య 4,57,191 గా ఉండగా. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 1,61,334 గా పేర్కొంది కేంద్ర ప్రభుత్వం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com