కరోనా దెబ్బకు రష్యా అతలాకుతలం
- October 29, 2021మాస్కో:గత రెండేళ్లుగా ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేసిన కరోనా ఇప్పటికీ భయపెడుతూనే ఉన్నది.రష్యా, చైనా,న్యూజిలాండ్,బ్రిటన్,ఆస్ట్రేలియా దేశాల్లో మళ్లీ కేసులు పెరుగుతున్నాయి.రష్యాలో కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి.నిన్నటి రోజున రష్యాలో ఏకంగా 40,096 పాజిటివ్ కేసులు నమోదవ్వగా, 1159 మంది కరోనాతో మృతి చెందారు.రష్యాలో అత్యధికంగా నమోదైన కేసులు ఇవేనని నిపుణులు చెబుతున్నారు.ప్రతిరోజూ వెయ్యికిపైగా మరణాలు సంభవిస్తుండటంతో ప్రభుత్వం అప్రమత్తం అయింది.అక్టోబర్ 30 వ తేదీ నుంచి నవంబర్ 6 వ తేదీ వరకు వారం రోజులపాటు జీతంతో కూడిన సెలవులు ప్రకటించింది ప్రభుత్వం.ప్రజలెవరూ బయటకు రావొద్దని హెచ్చరించింది.రష్యాలో మొత్తం 14.6 కోట్ల మంది జనాభా ఉండగా, ఇందులో కేవలం 4.9 కోట్ల మంది మాత్రమే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారు.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!