ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ 2021లో పాల్గొంటున్న ‘యూఏఈ’
- October 30, 2021
న్యూ ఢిల్లీలో నవంబర్ 14 నుండి 27 వరకు జరగనున్న ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ (IITF)లో యూఏఈ పాల్గొంటుదని, అది తమకు ముఖ్యమైన భాగస్వామి అని భారత వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దక్షిణాసియా ప్రాంతంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే వ్యాపార కార్యక్రమాలలో ఒకటైన IITFలో బహ్రెయిన్, చైనా, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, ఘనా, కిర్గిజిస్తాన్, ట్యునీషియా, టర్కీ, శ్రీలంక దేశాలు పాల్గొంటున్నాయన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని దేశాలు ఈ ట్రేడ్ ఫెయిర్ లో పార్టిసిపేట్ అయ్యే అవకాశం ఉందన్నారు. కరోనా మహమ్మారి కారణంగా గతేడాది ఐఐటీఎఫ్ నిర్వహించలేదని, తమ వ్యాపార లక్ష్యాలను తిరిగి పొందడానికి, తమ బ్రాండ్లను ప్రమోషన్ చేసుకునేందుకు విదేశీ వ్యాపార వర్గాలకు ఇది మంచి అవకాశమని భారత వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రగతి మైదాన్లో 73,000 చదరపు మీటర్లలో ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ నిర్వహించనున్నారు. గతంతో పోల్చితే మూడు రెట్ల విస్తీర్ణంలో ఈ ట్రేడ్ ఫెయిర్ జరుగనుంది. తొలి అయిదు రోజులు వ్యాపారవేత్తలు, ప్రత్యేక ఆహ్వానితులకు మాత్రమే అనుమతి ఉండగా.. ఆ తర్వాత రోజుల్లో సాధారణ ప్రజలను అనుమతిస్తారు.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









