ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ 2021లో పాల్గొంటున్న ‘యూఏఈ’
- October 30, 2021
న్యూ ఢిల్లీలో నవంబర్ 14 నుండి 27 వరకు జరగనున్న ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ (IITF)లో యూఏఈ పాల్గొంటుదని, అది తమకు ముఖ్యమైన భాగస్వామి అని భారత వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దక్షిణాసియా ప్రాంతంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే వ్యాపార కార్యక్రమాలలో ఒకటైన IITFలో బహ్రెయిన్, చైనా, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, ఘనా, కిర్గిజిస్తాన్, ట్యునీషియా, టర్కీ, శ్రీలంక దేశాలు పాల్గొంటున్నాయన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని దేశాలు ఈ ట్రేడ్ ఫెయిర్ లో పార్టిసిపేట్ అయ్యే అవకాశం ఉందన్నారు. కరోనా మహమ్మారి కారణంగా గతేడాది ఐఐటీఎఫ్ నిర్వహించలేదని, తమ వ్యాపార లక్ష్యాలను తిరిగి పొందడానికి, తమ బ్రాండ్లను ప్రమోషన్ చేసుకునేందుకు విదేశీ వ్యాపార వర్గాలకు ఇది మంచి అవకాశమని భారత వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రగతి మైదాన్లో 73,000 చదరపు మీటర్లలో ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ నిర్వహించనున్నారు. గతంతో పోల్చితే మూడు రెట్ల విస్తీర్ణంలో ఈ ట్రేడ్ ఫెయిర్ జరుగనుంది. తొలి అయిదు రోజులు వ్యాపారవేత్తలు, ప్రత్యేక ఆహ్వానితులకు మాత్రమే అనుమతి ఉండగా.. ఆ తర్వాత రోజుల్లో సాధారణ ప్రజలను అనుమతిస్తారు.
తాజా వార్తలు
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!







