నేటి నుంచే కొత్త కోవిడ్-19 ప్రోటోకాల్స్ అమలు..
- October 31, 2021అబుధాబి: కొత్త కోవిడ్-19 ప్రోటోకాల్స్ నేటి నుంచే అమల్లోకి రానున్నాయని అబుధాబి ఎమర్జెన్సీ, క్రైసిస్ అండ్ డిజాస్టర్స్ కమిటీ స్పష్టం చేసింది. బిజినెస్, ఎంటర్ టైన్ మెంట్, స్పోర్ట్స్, ఎగ్జిబిషన్ లకు సంబంధించిన అన్ని ఈవెంట్లను కొత్త నిబంధనల ప్రకారం నిర్వహించాలని పేర్కొంది. ఇవెంట్లకు హాజరయ్యే వారు కచ్చితంగా 96 గంటల్లోపు చేయించుకున్న నెటిటివ్ పీసీఆర్ పరీక్ష రిపోర్టును అల్హోస్న్ యాప్లో అప్ లోడ్ చేసి అనుమతి పొందాల్సి ఉంటుంది. బహిరంగ ప్రదేశాల్లో విధిగా మాస్కులను ధరించాలి. వారం క్రితం నేషనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్స్ మేనేజ్మెంట్ అథారిటీ (NCEMA), జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ (GCAA) UAE సిటిజన్స్ కోసం కొత్త ట్రావెల్ ప్రోటోకాల్స్ ను అప్డేట్ చేసిన విషయం తెలిసిందే. కొత్త అప్డేట్ ప్రకారం కోవిడ్-19 వ్యాక్సిన్ల పూర్తి మోతాదులను పొందిన వారు మాత్రమే అనుమతి ఉన్న జాబితాలోని దేశాలకు ప్రయాణించడానికి అనుమతిస్తారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..