ఖతార్ వెళ్లే వలసదారులకు కొత్త సమస్య..
- October 31, 2021
దోహా: ఖతార్ వెళ్లే వలసదారులకు కొత్త సమస్య వచ్చి పడింది. కరోనా నేపథ్యంలో తమ దేశానికి వచ్చేవారికి ఖతార్ ప్రభుత్వం ఏడు రోజుల క్వారంటైన్ తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడీ క్వారంటైన్ నిబంధన వలసకార్మికులకు పెద్ద సమస్యగా మారింది. ఖతార్ వెళ్లేవారు తప్పనిసరిగా హోటళ్లలో 7రోజులు సెల్ఫ్ క్వారంటైన్లో ఉండాల్సి రావడంతో హోటల్ గదులకు బాగా డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా అక్కడి హోటళ్లలో అద్దె గదులు దొరకడం గగనంగా మారింది. ఇక క్వారంటైన్కు అవసరమైన హోటల్ గది ఖాళీగా ఉంటేనే వీరి ప్రయాణానికి అనుమతి లభిస్తోంది. విమానయాన సంస్థలు కూడా హోటల్ గది దొరికినట్లు ఆధారం చూపిస్తేనే టికెట్లు ఇస్తున్నాయి. మన దగ్గర నుంచి ప్రస్తుతం ఆ దేశానికి విమానాలు బాగానే నడుస్తున్నా.. అక్కడికి వెళ్లిన తరువాత 7 రోజులపాటు క్వారంటైన్లో ఉండటానికి అవసరమైన హోటల్ గదులు దొరకడం లేదు. దీంతో వలసదారులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి దాపురించింది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- విజయవాడ హైవే మీద ప్రయాణించే వారికి శుభవార్త
- అక్రమ మందుల అమ్మకాల పై సౌదీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొరడా..!!
- ప్రాంతీయ భద్రత పై కింగ్ హమద్, యూకే రక్షణ మంత్రి చర్చలు..!!
- త్వరలోనే భారత్ కు సెల్వం కృష్ణన్ పార్ధివ దేహం..భారత రాయబారి..!!
- హ్యూమన్ ట్రాఫికింగ్ ను ఇలా గుర్తించండి..గైడ్ లైన్స్ విడుదల చేసిన ఖతార్..!!
- మిడిలీస్టులో యుద్ధ పరిణామాల పై సమావేశం..పాల్గొన్న ఒమన్..!!
- యూఏఈలో ఏప్రిల్ 17 వరకు డిస్టన్స్ లెర్నింగ్ పొడిగింపు..!!
- సమాజ సేవలో 'అర్జాస్ స్టీల్' ముందంజ
- IPL 2026: CSK పై RR విజయం
- యాపిల్స్ తో మోసం..హైదరాబాద్ వ్యాపారికి రూ.5.7 కోట్లు టోపీ !!









