సౌదీ పెవిలియన్: రికార్డ్ స్థాయిలో 5 లక్షల విజిటర్స్ సందర్శన
- October 31, 2021
దుబాయ్: దుబాయ్ ఎక్స్ పో -2020 సక్సెస్ ఫుల్ గా సాగుతోంది. అన్ని దేశాల పెవిలియన్ల కు చాలా మంది విజిటర్స్ వస్తున్నారు. ఐతే సౌదీ అరేబియా పెవిలియన్ మాత్రం స్పెషల్ అట్రాక్షన్ గా మారింది. లక్షలాది మంది ఈ పెవిలియన్ ను సందర్శిస్తున్నారు. నెల రోజులు కూడా గడవకముందే రికార్డ్ స్థాయిలో 5 లక్షల మంది విజిట్ చేశారు. వరల్డ్ వైడ్ ఈవెంట్ లో ఈ స్థాయిలో సౌదీ పెవిలియన్ ను సందర్శించటం ఒక రికార్డ్ అని అధికారులు తెలిపారు.యూఏఈ దేశాలతో పాటు ఇతర దేశాల ప్రజలు, డెలిగేట్స్ తమ పెవిలియన్ ను విజిట్ చేసి..సౌదీ చరిత్రను, ఇక్కడ వ్యాపార అవకాశాల గురించి ఆరా తీస్తున్నారని అధికారులు వివరించారు. మరో ఐదు నెలల పాటు ఎక్స్ పో కొనసాగుతుంది. ఈ ఎక్స్ పో ముగిసే నాటికి 25 లక్షల మంది సౌదీ పెవిలియన్ ను విజిట్ చేస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్లో అరబ్ పార్లమెంట్ అధ్యక్షుడితో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్కు ఆహ్వానం







