5-11 ఏళ్ల చిన్నారులకు వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ షురూ
- October 31, 2021
కువైట్: కరోనా ఎఫెక్ట్ పిల్లల పై పడకుండా ఉండేందుకు కువైట్ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 5 నుంచి 11 ఏళ్ల లోపు చిన్నారులకు కూడా వ్యాక్సిిన్ ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించింది. ఐతే ఇందుకు సంబంధించిన ప్రక్రియ ఆదివారం నుంచి షురూ కానుంది. వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్స్ ను ప్రారంభించినట్లు కువైట్ హెల్త్ మినిస్ట్రీ ప్రకటించింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తైన తర్వాత క్రమంగా వ్యాక్సినేషన్ ప్రారంభిస్తామని హెల్త్ మినిస్ట్రీ అధికారులు తెలిపారు. రిజిస్ట్రేషన్ చేసుకోగానే పిల్లల పేరెంట్స్ కు గానీ గార్డియన్ గానీ టెక్స్ట్ మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ లో వ్యాక్సినేషన్ డేట్, సెంటర్ పేరు ఉంటుందని అధికారులు చెప్పారు. పేరెంట్స్ తప్పకుండా తమ పిల్లలకు వ్యాక్సిన్ ఇప్పించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్లో అరబ్ పార్లమెంట్ అధ్యక్షుడితో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్కు ఆహ్వానం







