5-11 ఏళ్ల చిన్నారులకు వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ షురూ
- October 31, 2021
కువైట్: కరోనా ఎఫెక్ట్ పిల్లల పై పడకుండా ఉండేందుకు కువైట్ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 5 నుంచి 11 ఏళ్ల లోపు చిన్నారులకు కూడా వ్యాక్సిిన్ ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించింది. ఐతే ఇందుకు సంబంధించిన ప్రక్రియ ఆదివారం నుంచి షురూ కానుంది. వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్స్ ను ప్రారంభించినట్లు కువైట్ హెల్త్ మినిస్ట్రీ ప్రకటించింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తైన తర్వాత క్రమంగా వ్యాక్సినేషన్ ప్రారంభిస్తామని హెల్త్ మినిస్ట్రీ అధికారులు తెలిపారు. రిజిస్ట్రేషన్ చేసుకోగానే పిల్లల పేరెంట్స్ కు గానీ గార్డియన్ గానీ టెక్స్ట్ మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ లో వ్యాక్సినేషన్ డేట్, సెంటర్ పేరు ఉంటుందని అధికారులు చెప్పారు. పేరెంట్స్ తప్పకుండా తమ పిల్లలకు వ్యాక్సిన్ ఇప్పించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







