గుడ్ న్యూస్ చెప్పిన ఇండియన్ ఎంబసీ
- October 31, 2021
బహ్రెయిన్: బహ్రెయిన్ లో ఉంటున్న ఇండియన్స్ కు గుడ్ న్యూస్. ఇక్కడ ఉంటున్న భారతీయులకు ఎలాంటి సమస్యలు వచ్చిన వెంటనే వారికి అండగా ఉండేందుకు ఇండియన్ ఎంబసీ కొత్త మొబైల్ యాప్ ను లాంఛ్ చేయనుంది. త్వరలోనే ఇది అందుబాటులోకి రానుందని బహ్రెయిన్ లోని ఇండియన్ ఎంబసీ ప్రకటించింది. ఈ యాప్ సేవలు ప్రారంభమైతే ఇండియన్స్ ఏ సమస్య వచ్చినా సరే మొబైల్ యాప్ ద్వారా ఎంబసీకి తెలియజేయవచ్చు. దీని ద్వారా భారతీయులకు మరిన్ని సేవలు సులభంగా అందనున్నాయి. ఎంబసీ అధికారులతో అపాయింట్ మెంట్ కోసం మొబైల్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎంబసీతో ఇండియన్స్ కు స్నేహపూర్వక సంబంధాలు ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు తెలిపారు. అదే విధంగా ఐవీఎస్ సెంటర్ ను కూడా షిప్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. అటు ఇటీవల మళ్లీ బహ్రెయిన్ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఇండియన్స్ అంతా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







