గుడ్ న్యూస్ చెప్పిన ఇండియన్ ఎంబసీ
- October 31, 2021బహ్రెయిన్: బహ్రెయిన్ లో ఉంటున్న ఇండియన్స్ కు గుడ్ న్యూస్. ఇక్కడ ఉంటున్న భారతీయులకు ఎలాంటి సమస్యలు వచ్చిన వెంటనే వారికి అండగా ఉండేందుకు ఇండియన్ ఎంబసీ కొత్త మొబైల్ యాప్ ను లాంఛ్ చేయనుంది. త్వరలోనే ఇది అందుబాటులోకి రానుందని బహ్రెయిన్ లోని ఇండియన్ ఎంబసీ ప్రకటించింది. ఈ యాప్ సేవలు ప్రారంభమైతే ఇండియన్స్ ఏ సమస్య వచ్చినా సరే మొబైల్ యాప్ ద్వారా ఎంబసీకి తెలియజేయవచ్చు. దీని ద్వారా భారతీయులకు మరిన్ని సేవలు సులభంగా అందనున్నాయి. ఎంబసీ అధికారులతో అపాయింట్ మెంట్ కోసం మొబైల్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎంబసీతో ఇండియన్స్ కు స్నేహపూర్వక సంబంధాలు ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు తెలిపారు. అదే విధంగా ఐవీఎస్ సెంటర్ ను కూడా షిప్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. అటు ఇటీవల మళ్లీ బహ్రెయిన్ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఇండియన్స్ అంతా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఓటింగ్ సరళి విపరీతంగా పెరిగే అవకాశం!
- తిరిగి విధుల్లో చేరిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ క్యాబిన్ సిబ్బంది!
- తెలంగాణలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన..
- లోక్సభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: డీజీపీ రవిగుప్తా
- అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తు, ఫీజు, ప్రక్రియ
- దుబాయ్లో పెట్టుబడి ద్వారా ఉద్యోగి గోల్డెన్ వీసాకు మారవచ్చా?
- బహ్రెయిన్ చేరుకున్న అరబ్ లీగ్ చీఫ్
- మోసపూరిత ప్రకటనల పై సౌదీ హెచ్చరిక
- కువైట్ అమీర్ కు వ్యతిరేకంగా పోస్టులు..పలువురికి నోటీసులు
- 250 మంది ప్రవాసులకు ఒమానీ పౌరసత్వం