బూస్టర్ డోస్ కోసం అపాయింట్ మెంట్ అవసరం లేదు
- November 03, 2021
కువైట్: బూస్టర్ డోస్ తీసుకోవాల్సిన వారికి కువైట్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. బూస్టర్ డోస్ కావాల్సిన వారెవరు కూడా అపాయింట్ మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. రెండో డోస్ తీసుకున్న తర్వాత 6 నెలలు ముగిసిన వారంతా బూస్టర్ డోస్ తీసుకోవచ్చని చెప్పారు. రిస్క్ గ్రూప్ లో ఉన్న వారందరికీ వ్యాక్సినేషన్ రెండు డోసులు పూర్తైన తర్వాత కూడా కరోనా ప్రమాదం ఉందని గుర్తించారు. ఇలాంటి వారి కోసం బూస్టర్ డోస్ ఇచ్చేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీరికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది పెడితే వ్యాక్సినేషన్ ఆలస్యం అవుతుందని ప్రభుత్వం భావించింది. అందుకోసమే ఎలాంటి రిజిస్ట్రేషన్ ప్రక్రియ లేకుండా బూస్టర్ డోస్ ఇవ్వాలని కువైట్ ప్రభుత్వం నిర్ణయించింది. బూస్టర్ డోస్ తీసుకోవాల్సిన వారు నేరుగా కువైట్ లోని మిష్రప్ వ్యాక్సినేషన్ సెంటర్ కు వెళ్లాలని హెల్త్ డిపార్ట్ మెంట్ అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు