10 వేల ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తాం..IOC చైర్మన్
- November 03, 2021న్యూ ఢిల్లీ: భారత్ వ్యాప్తంగా రాబోయే మూడేళ్లలో ఎలక్ట్రిక్ వాహనాల కోసం 10 వేల ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(IOC)ప్రకటించింది.
ఇందులో భాగంగా వచ్చే 12 నెలల్లోనే 2వేల ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు ఐఓసీ చైర్మన్ ఎస్ఎం వైద్య తెలిపారు.
మిగిలిన 8 వేల ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను వచ్చే రెండేళ్లలో పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. మూడేళ్లలోనే 10 వేల ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల నిర్మాణ టార్గెట్ను అందుకోనున్నట్లు ఐఓసీ చైర్మన్ తెలిపారు.
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు సమగ్ర ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు అవసరం. కర్ణాటక మరియు ఢిల్లీ వంటి రాష్ట్రాలు తమ ప్రజా రవాణా వ్యవస్థలో ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలను చేర్చాయి. దీంతో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లకు డిమాండ్ పెరుగుతుంది. అనేక ప్రైవేట్ మరియు ప్రభుత్వ సంస్థలు దేశంలో EV ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నాయి.
గత వారం, దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ ఇంటిగ్రేటెడ్ కంపెనీలలో ఒకటైన టాటా పవర్.. దేశవ్యాప్తంగా 1000 కంటే ఎక్కువ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటును పూర్తి చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపింది.దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 69 వేల పెట్రోల్ పంపుల వద్ద కనీసం ఒక ఈవీ ఛార్జింగ్ యూనిట్ను పెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది.
తాజా వార్తలు
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు
- కువైట్లో బ్యాచిలర్లకు కొత్త కష్టాలు..!
- QR247 మిలియన్లు తిరిగి చెల్లించాలని సీఈఓను ఆదేశించిన కోర్టు
- 2023లో 99%కి చేరుకున్న సౌదీ ఇంటర్నెట్ వినియోగం
- మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం.. అగ్రస్థానంలో భారతీయులు
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ సీజన్..మరో 3 రోజులు పొడిగింపు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం