'సర్కారు వారి పాట' కొత్త రిలీజ్ డేట్ ఇదే..
- November 03, 2021
టాలీవుడ్ స్టార్ హీరో, ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం చేస్తున్న సినిమా సర్కారు వారి పాట. ఈ సినిమాకు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పరుశురాం దర్శకత్వం వహిస్తున్నారు.
పొలిటికల్ అండ్ మాస్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు. మహానటి కీర్తిసురేష్ నటిస్తోన్న సంగతి తెలిసిందే.
ఇక ఈ సినిమా కు నవీన్ ఎర్నేని, వై రవి శంకర్ మరియు గోపి ఆచంట నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇది ఇలా ఉండగా సర్కారు వారి పాట సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేసింది చిత్ర బృందం.
వచ్చే ఏడాది అంటే..ఉగాది కానుకగా ఏప్రిల్ 1 వ తేదీన సర్కారు వారి పాట సినిమాను విడుదల చేయనున్నట్లు అఫిషీయల్ గా ప్రకటించింది చిత్ర యూనిట్. ఈ మేరకు ఓ పోస్టర్ కూడా వదిలింది. కాగా.. గతంలో సంక్రాంతి కానుకగా విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే. సంక్రాంతికి వరుసగా సినిమా ఉండటంతో.. ఏప్రిల్ కి షిఫ్ట్ అయింది సర్కారు వారి పాట.
తాజా వార్తలు
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!
- ఒమన్ లో చిన్నారిని రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- బహ్రెయన్ లో బీభత్సం సృష్టించిన వర్షాలు..!!
- ఎంపీలకు తేనీటి విందు ఇచ్చిన స్పీకర్ ఓం బిర్లా..
- డిసెంబర్ 31లోపు ఈ పనులు చేయకపోతే భారీ జరిమానా!
- తిరుమల వెళ్లే భక్తులకు ఆర్టీసీ శుభవార్త







