వలసదారులు తిరిగి వచ్చేందుకు అనుమతిచ్చాక కువైట్ చేరుకున్న 1.4M ప్రయాణీకులు
- November 03, 2021
కువైట్: ఆగస్ట్ 1న వలసదారులు తిరిగి కువైట్ వచ్చేందుకు వీలుగా అనుమతిచ్చాక ఇప్పటివరక 1.396 మిలియన్ల మంది ప్రయాణీకులు కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా ప్రయాణించారు. 42 ఎయిర్ ఆపరేటర్లు మొత్తం 11,113 విమానాల్ని నడిపారు. మొత్తం ప్రయాణీకుల్లో 45 శాతం మంది కువైట్ వచ్చినవారు కాగా, 48.5 శాతం మంది కువైట్ నుంచి వెళ్ళినవారు. మిగిలినవారు ట్రాన్సిట్ ప్రయాణీకులు. కువైట్ ఎయిర్ వేస్ 3,005 విమానాల్ని నడిపింది. జజీరా ఎయిర్ వేస్ 3,083 విమానాల్ని నడిపింది. ఇండిగో 290 విమానాల్ని, ఎయిర్ ఎక్స్ప్రెస్ 118 విమానాల్ని, ఎయిర్ ఇండియా 172 విమానాల్ని, గో ఎయిర్ 90, స్పైస్ జెట్ 46 విమానాల్ని నడిపాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..