అబుధాబిలో కొత్త ట్రాఫిక్ రూల్..
- November 06, 2021అబుధాబి: అబుధాబిలో వాహనదారులను ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. భారీ శబ్ధం చేసే వాహనాలు నడిపితే కఠిన చర్యలతో పాటు భారీ జరిమానా విధిస్తామని వెల్లడించారు. ధ్వని కాలుష్యం విపరీతంగా పెరగడంతో ప్రజలకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రధానంగా యువత గట్టి శబ్ధాలతో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తున్నారని తద్వారా ప్రజా జీవనానికి, శాంతికి భంగం కలుగుతుందని తెలిపారు. కనుక ఇకపై నివాస ప్రాంతాల్లో భారీ ధ్వనులతో వాహనాలు నడిపితే 999 నెంబర్కు కాల్ చేసి చెప్పాలని సూచించారు.
ట్రాఫిక్ చట్టంలోని ఆర్టికల్ 20 ప్రకారం ఇలా భారీ శబ్ధాలతో వాహనం నడిపేవారికి 2వేల దిర్హమ్స్ జరిమానా విధించే అవకాశం ఉందన్నారు. అలాగే అలాంటి వాననం నడిపినందుకు వాహనదారుడి ఖాతాలో 12 బ్లాక్ పాయింట్లు వేస్తారు. వాహనం ఇంజిన్ను అనధికారికంగా మార్పులు చేసి ధ్వని కాలుష్యానికి పాల్పడితే ఆర్టికల్ 73 ప్రకారం వెయ్యి దిర్హమ్స్ ఫైన్, 12 ట్రాఫిక్ పాయింట్లు పడతాయన్నారు. అలాగే వాహనాన్ని 30 రోజులు జప్తు చేయడం జరుగుతుంది. వాహనం జప్తు చేసిన తర్వాత మూడు నెలలలోపు 10వేల దిర్హమ్స్ జరిమానా చెల్లించి వాహనాన్ని విడిపించుకోవాలి. లేనిపక్షంలో వాహనాన్ని వేలం వేయడం జరుగుతుందని ట్రాఫిక్ అధికారులు చెప్పుకొచ్చారు.
తాజా వార్తలు
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..