టీ 20 ప్రపంచకప్లో అనుకోని విషాదం..
- November 08, 2021
అబుధాబి: క్రికెట్ అభిమానులను అలరిస్తోన్న టీ20 ప్రపంచకప్లో అనుకోని విషాదం చోటుచేసుకుంది. భారత సంతతికి చెందిన పిచ్ క్యూరేటర్ మోహన్ సింగ్ గదిలో ఫ్యాన్కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.అబుధాబి వేదికగా ఆదివారం జరిగిన న్యూజిలాండ్- అఫ్గానిస్తాన్ మ్యాచ్కు ముందే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ఆదివారం ఉదయమే పిచ్ను పర్యవేక్షించి గ్రౌండ్ సిబ్బందికి సూచనలు అందజేసిన ఆయన ఆతర్వాత తన గదికి వెళ్లిపోయాడు.అయితే ఆ తర్వాత బయటకు రాలేదు. దీంతో అనుమానమొచ్చిన గ్రౌండ్ సిబ్బంది ఆయన గదికి వెళ్లి పరిశీలించగా ఫ్యాన్కు వేలాడుతూ కనిపించారు.
ఉత్తరాఖండ్కు చెందిన మోహన్ సింగ్ 2004లో దుబాయ్ కి వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. అంతకుముందు పంజాబ్లోని మొహాలీలో ఉన్న పంజాబ్ క్రికెట్ స్టేడియం పిచ్ క్యూరేటర్ (ట్రైనీ)గా సేవలందించారు.దీంతో పాటు గ్రౌండ్ సూపర్ వైజర్, కోచ్, సహాయకుడి బాధ్యతలు కూడా నిర్వర్తించారు. అయితే భారత్ సెమీస్ అవకాశాలను ప్రభావితం చేసే న్యూజిలాండ్- అఫ్గానిస్తాన్ కీలకమైన మ్యాచ్ కు ముందు ఆయన మరణించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆయన ఆత్మహత్య చేసుకున్నారా? లేక ఎవరైనా ఆగంతకులు హత్య చేశారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే మోహన్ సింగ్ గత కొంత కాలంగా మానసిక ఆందోళన, డిప్రెషన్తో బాధపడుతున్నారని వీటిని తట్టుకోలేకే బలవన్మరణానికి పాల్పడి ఉంటారని దుబాయ్ క్రికెట్ అధికారులు చెబుతున్నారు.అబుధాబి పోలీసులు దీనిని అనుమానాస్పద మృతిగా నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.మోహన్ సింగ్ కుటుంబానికి ICC మరియు అబుధాబి క్రికెట్ తమ సంతాపాన్ని తెలియజేసాయి.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







