మిలటరీ హెలికాఫ్టర్ కూలిన ఘటనలో మృతుల సంఖ్య 13కు
- March 21, 2016
ఇండోనేషియాలో ఆదివారం మిలటరీ హెలికాఫ్టర్ కూలిన ఘటనలో మృతుల సంఖ్య 13కు పెరిగింది. ఈ విషయాన్ని అక్కడి మిలిటరీ అధికారులు వెల్లడించారు. సోమవారం మరో సైనికుడి మృతదేహాన్ని గుర్తించడంతో మృతుల సంఖ్య 13కు చేరిందని చెప్పారు. ఈ విషయమై మిలటరీ ప్రతినిధి మేజర్ జనరల్ తతాంగ్ సులేమాన్ మాట్లాడారు.'బెల్ 412 -ఈపీ' అనే మిలటరీ హెలీకాఫ్టర్ 13 మంది సైనికులతో పోసో జిల్లాలోని వతుతువా గ్రామం నుంచి ఆదివారం టేకాఫ్ అయింది.టేకాఫ్ అయిన 35 నిమిషాల్లో ఇంజిన్లో మంటలు చెలరేగి కూలిపోయింది. ఆదివారం నాడు 12 మృతదేహాల్ని గుర్తించగా సోమవారం మరో మృతదేహాన్ని గుర్తించామన్నారు. ఆ హెలీకాఫ్టర్ కొని మూడేళ్లైందని చెప్పారు. ప్రయాణం సమయంలో ఆకాశంలో మెరుపులు రావడంతో మెరుపుల దాటికి దానిలో మంటలు చెలరేగి ఉండవచ్చని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం
- గద్దర్ ఫిలిం అవార్డ్స్: విజేతల పూర్తి జాబితా ఇదే!
- బెంగళూరుకు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం!
- సీఎం సమక్షంలో 124 మంది మావోయిస్టుల లొంగుబాటు
- క్షమించడండి అంటూ ఇరాన్ అధ్యక్షుడి కీలక ప్రకటన
- *బ్రేకింగ్: విమాన సర్వీసులను పునరుద్ధరించిన ఎమిరేట్స్! కన్ఫర్మ్డ్ టికెట్ ఉన్న ప్రయాణీకులకే!
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?









