విమాన ఛార్జీల మోత...భారత్ కు వెళ్లాలంటే రెట్టింపు రేట్లు
- November 11, 2021
యూఏఈ: చలికాలం సెలవుల కంటే ముందే విమాన ఛార్జీలు రెట్టింపు అయ్యాయి. స్కూళ్లకు సెలవులు ప్రకటించడం, దుబాయ్ ఎక్స్ పో-2020, దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ వంటి మెగా ఈవెంట్ల కోసం వచ్చిన వారు తిరిగి స్వదేశాలకు తిరుగు ప్రయాణం అయిన నేపథ్యంలో ఛార్జీల మోత మోగించారు. ప్రయాణీకుల రద్దీ కారణంగా డిసెంబర్లో దుబాయ్ నుండి భారత ఉపఖండానికి విమాన ఛార్జీలను దాదాపు రెట్టింపు చేశారు. ఎయిర్ బబుల్ ఒప్పందాల కారణంగా తక్కువ విమానాలు నడుస్తున్నాయి. దీంతో రాబోయే కొద్ది నెలలు భారతీయ ఉపఖండానికి విమాన ఛార్జీలు ఎక్కువగానే ఉంటాయని విమానయాన వర్గాలు తెలిపాయి. స్కూళ్లకు సెలవులు ఇవ్వడంతో చాలామంది భారతీయ కుటుంబాలు క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనేందుకు తమ స్వస్థలాలకు వెళ్లనున్నారు. ఈ కారణంగా డిసెంబర్ నెలలో యూఏఈ-ఇండియాలోని కొన్ని విమాన మార్గాల్లో ఛార్జీలు 1,200 -1,300 దిర్హామ్స్ నుంచి 2,300 దిర్హామ్స్ కు పైగా పెంచారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో







