విమాన ఛార్జీల మోత...భారత్ కు వెళ్లాలంటే రెట్టింపు రేట్లు
- November 11, 2021యూఏఈ: చలికాలం సెలవుల కంటే ముందే విమాన ఛార్జీలు రెట్టింపు అయ్యాయి. స్కూళ్లకు సెలవులు ప్రకటించడం, దుబాయ్ ఎక్స్ పో-2020, దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ వంటి మెగా ఈవెంట్ల కోసం వచ్చిన వారు తిరిగి స్వదేశాలకు తిరుగు ప్రయాణం అయిన నేపథ్యంలో ఛార్జీల మోత మోగించారు. ప్రయాణీకుల రద్దీ కారణంగా డిసెంబర్లో దుబాయ్ నుండి భారత ఉపఖండానికి విమాన ఛార్జీలను దాదాపు రెట్టింపు చేశారు. ఎయిర్ బబుల్ ఒప్పందాల కారణంగా తక్కువ విమానాలు నడుస్తున్నాయి. దీంతో రాబోయే కొద్ది నెలలు భారతీయ ఉపఖండానికి విమాన ఛార్జీలు ఎక్కువగానే ఉంటాయని విమానయాన వర్గాలు తెలిపాయి. స్కూళ్లకు సెలవులు ఇవ్వడంతో చాలామంది భారతీయ కుటుంబాలు క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనేందుకు తమ స్వస్థలాలకు వెళ్లనున్నారు. ఈ కారణంగా డిసెంబర్ నెలలో యూఏఈ-ఇండియాలోని కొన్ని విమాన మార్గాల్లో ఛార్జీలు 1,200 -1,300 దిర్హామ్స్ నుంచి 2,300 దిర్హామ్స్ కు పైగా పెంచారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు