'ఖిలాడీ' విడుదల తేదీ ఖరారు
- November 11, 2021హైదరాబాద్: మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబినేషన్లో యాక్షన్ ఎంటర్టైనర్ "ఖిలాడి". సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి కథానాయికలు. ఎ స్టూడియోస్తో కలిసి బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రవితేజ పూర్తి భిన్నమైన పాత్రను పోషిస్తున్నారు. హవీష్ ప్రొడక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా స్మార్ట్ ప్లే అనే ట్యాగ్ లైన్ తో వస్తుంది. తాజాగా మేకర్స్ ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఫిబ్రవరి 11, 2022న ఖిలాడీ తెరపైకి రానుందని మేకర్స్ ప్రకటించారు. అనౌన్స్మెంట్ పోస్టర్లో రవితేజ సిగరెట్ తాగుతూ ఘాటైన రూపంలో కనిపిస్తున్నాడు. మాస్ మహారాజ అభిమానులు ఈ సినిమా గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తాజా వార్తలు
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..