వ్యాక్సినేషన్ పూర్తయిన వారికి పిసిఆర్ టెస్టు రద్దు: యూఏఈని కోరనున్న ఇండియా
- November 11, 2021
యూఏఈ: భారత హోం మినిస్ట్రీ, వ్యాక్సినేషన్ పూర్తయినవారికి తప్పనిసరి పిసిఆర్ టెస్ట్ రద్దు చేసే అంశంపై మిడిల్ ఈస్ట్ దేశాలతో చర్చించాలనీ, మరీ ముఖ్యంగా ఈ విషయమై యూఏఈని ఒప్పంచాలని యోచిస్తోంది. ఈ మేరకు భారత హోం మినిస్ట్రీ అంతర్గత సమావేశం జరిగింది. ఈ విషయమై సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ, యూఏఈ వెళ్ళేవారికి పీసీఆర్ టెస్ట్ తప్పనిసరి నిర్ణయాన్ని రద్దు చేయాలనే అంశంపై చర్చించినట్లు చెప్పారు. భారతదేశంలోని ఏ విమానాశ్రయం నుంచి బయల్దేరే ప్రయాణీకులైనా, దానికి ఆరు గంటల ముందుగా పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి. ఇండియాతోపాటు పాకిస్తాన్, నేపాల్, శ్రీలంక, నైజీరియా, యుగాండా దేశాలకు యూఏఈ ఈ నిబంధన విధించింది. తప్పనిసరి టెస్ట్ కారణంగా ఎక్కువమందిలోకి వెళ్ళాల్సి వస్తోందనీ, అదనపు సమయం పడుతోందని ఫైజల్ రఫిక్ అనే ప్రయాణీకుడు చెప్పారు. వర్కర్లకు ఇది అదనపు ఆర్థిక భారం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. మరో ప్రయాణీకుడు షోబిత్ నాందీ మాట్లాడుతూ, ఢిల్లీ విమానాశ్రయంలో ఖర్చు చేసి టెస్ట్ చేయించుకున్నా, తిరిగి యూఏఈలో టెస్ట్ చేయించుకోవాల్సి వస్తోందనీ, కొన్ని కేసుల్లో క్వారంటైన్ కూడా తప్పడంలేదని అన్నారు.
తాజా వార్తలు
- విశాఖలో డేటా సెంటర్ శంకుస్థాపనకు ముహూర్తం ఫిక్స్
- ఏపీలో విచిత్ర వాతవరణం: మండుతున్న ఎండలు.. కురుస్తున్న వర్షాలు
- ఆదిలాబాద్ ఎయిర్పోర్టుకు ముహూర్తం ఫిక్స్
- ఒకే ఫోన్ కాల్తో BD1,030 కోల్పోయిన మహిళ..!!
- వెబ్సైట్ల విశ్వసనీయత పై SDAIA కీలక సూచనలు..!!
- దుబాయ్-షార్జా-అజ్మాన్ మధ్య కొత్త ట్రాన్స్ పోర్ట్ ప్రణాళిక..!!
- హోర్ముజ్ రాకపోకల పై ఒమన్, ఇరాన్ చర్చలు..!!
- కొత్తగా ఐదు ఐపీ ఇ-సేవలను ప్రారంభించిన ఖతార్..!!
- కువైట్ లో వాటిని వీడియో తీసిన 29 మంది అరెస్టు..!!
- బాసర ఆలయాభివృద్ధి పనులకు సీఎం రేవంత్ భూమిపూజ |









