వ్యాక్సినేషన్ పూర్తయిన వారికి పిసిఆర్ టెస్టు రద్దు: యూఏఈని కోరనున్న ఇండియా
- November 11, 2021
యూఏఈ: భారత హోం మినిస్ట్రీ, వ్యాక్సినేషన్ పూర్తయినవారికి తప్పనిసరి పిసిఆర్ టెస్ట్ రద్దు చేసే అంశంపై మిడిల్ ఈస్ట్ దేశాలతో చర్చించాలనీ, మరీ ముఖ్యంగా ఈ విషయమై యూఏఈని ఒప్పంచాలని యోచిస్తోంది. ఈ మేరకు భారత హోం మినిస్ట్రీ అంతర్గత సమావేశం జరిగింది. ఈ విషయమై సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ, యూఏఈ వెళ్ళేవారికి పీసీఆర్ టెస్ట్ తప్పనిసరి నిర్ణయాన్ని రద్దు చేయాలనే అంశంపై చర్చించినట్లు చెప్పారు. భారతదేశంలోని ఏ విమానాశ్రయం నుంచి బయల్దేరే ప్రయాణీకులైనా, దానికి ఆరు గంటల ముందుగా పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి. ఇండియాతోపాటు పాకిస్తాన్, నేపాల్, శ్రీలంక, నైజీరియా, యుగాండా దేశాలకు యూఏఈ ఈ నిబంధన విధించింది. తప్పనిసరి టెస్ట్ కారణంగా ఎక్కువమందిలోకి వెళ్ళాల్సి వస్తోందనీ, అదనపు సమయం పడుతోందని ఫైజల్ రఫిక్ అనే ప్రయాణీకుడు చెప్పారు. వర్కర్లకు ఇది అదనపు ఆర్థిక భారం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. మరో ప్రయాణీకుడు షోబిత్ నాందీ మాట్లాడుతూ, ఢిల్లీ విమానాశ్రయంలో ఖర్చు చేసి టెస్ట్ చేయించుకున్నా, తిరిగి యూఏఈలో టెస్ట్ చేయించుకోవాల్సి వస్తోందనీ, కొన్ని కేసుల్లో క్వారంటైన్ కూడా తప్పడంలేదని అన్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ లో గన్ తో కానిస్టేబుల్ హాల్ చల్
- కార్లలో పిల్లలను ఒంటరిగా వదిలేస్తే భారీ జరిమానా, జైలు శిక్ష
- అమెరికాలో 11 ఏళ్ల తెలుగు బాలిక అద్భుత ఘనత..
- కరీంనగర్లో మినిస్టర్ వైట్ షోరూమ్ ప్రారంభం
- ఖతార్లో డిజిటల్ చైల్డ్ ప్రొటెక్షన్ చట్టంపై కేబినెట్ రివ్యూ..!!
- కొత్తగా స్థాపించిన వ్యాపారాలకు వీసాలు తగ్గించిన సౌదీ..!!
- డొమెస్టిక్ వర్కర్ పర్మిట్ సర్వీస్ అప్డేట్: LMRA
- అల్ జబల్ అల్ అఖ్దర్ ఫెస్టివల్ 2026.. వివరాలు వెల్లడి..!!
- కువైట్ ఎయిర్ కార్గోలో డ్రగ్ స్మగ్లింగ్ ప్రయత్నం భగ్నం..!!
- దుబాయ్ షేక్ జాయెద్ రోడ్లోని భవనంలో అగ్నిప్రమాదం..!!









