"దృశ్యం-2" టీజర్..ఎట్టకేలకు వీడిన సస్పెన్స్
- November 12, 2021విక్టరీ వెంకటేష్ తాజా థ్రిల్లర్ డ్రామా చిత్రం 'దృశ్యం 2'. ఆయన హిట్ చిత్రం 'దృశ్యం' సీక్వెల్, మలయాళ చిత్రం 'దృశ్యం 2' రీమేక్. తెలుగులోనూ అదే టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు.
తాజాగా ఈ సినిమా టీజర్ను విడుదల చేశారు మేకర్స్. వరుణ్ కేసు గురించి అందరూ మాట్లాడుకోవడంతో టీజర్ ప్రారంభమవుతుంది. గత ఆరేళ్లుగా సాధారణ జీవితం గడుపుతున్న ఆ కుటుంబం మళ్లీ చీకటి జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయింది. ఆ ఇష్యూ నుంచి బయటపడేందుకు వెంకీ మరో మాస్టర్ ప్లాన్ తో వచ్చాడని తెలుస్తోంది. టీజర్ గ్రిప్పింగ్ గా కనిపించదమే కాదు ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఇక ఇదే టీజర్ తో సినిమా విడుదల గురించి చాలా కాలంగా కొనసాగుతున్న సస్పెన్స్ కు తెర దించారు మేకర్స్. నవంబర్ 25న ప్రముఖ ఓటిటి ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో సినిమా ప్రీమియర్ కానుంది. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా, సతీష్ కురుప్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. మీనా, నదియా, నరేష్, కృతిక, ఎస్తేర్ అనిల్ వంటి మొదటి భాగంలో నటించిన నటీనటులే 'దృశ్యం 2″లోనూ కనిపించనున్నారు. సంపత్ రాజ్, పూర్ణ సీక్వెల్లో కొత్త పాత్రలను పోషించారు. ఒరిజినల్ చిత్రానికి దర్శకత్వం వహించిన జీతూ జోసెఫ్ తెలుగు వెర్షన్కు కూడా దర్శకత్వం వహించారు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్