టన్నెలింగ్‌ వర్క్‌ని పూర్తి చేసుకున్న దోహా మెట్రో

- March 21, 2016 , by Maagulf
టన్నెలింగ్‌ వర్క్‌ని పూర్తి చేసుకున్న దోహా మెట్రో

ఖతార్‌ రైల్‌ మేజర్‌ మైల్‌ స్టోన్‌ని చేరుకుంది. దోహా మెట్రోకి సంబంధించి నార్తరన్‌ సెక్షన్‌లో టన్నెలింగ్‌ వర్క్‌ పూర్తి చేయడం ద్వారా ఈ ఘనతను సాధించింది. లెగ్తాఫియా స్టేషన్‌ మరియు ఖతార్‌ యూనివర్సిటీ మధ్య ఈ టన్నెల్‌ని పూర్తి చేశారు. టన్నెల్‌ బోరింగ్‌ వర్క్‌ పూర్తవడంతో ట్రాక్‌ నిర్మాణం, పవర్‌ సప్లయ్‌, సిగ్నలింగ్‌, ఇతర పనులపై కాంట్రాక్టర్లు ఇక నుంచి దృష్టిపెట్టనున్నారు. దోహా మెట్రో ప్రాజెక్ట్‌కి సంబంధించి 85 శాతం టన్నెలింగ్‌ వర్క్‌ పూర్తయ్యింది. ఓవరాల్‌గా ప్రాజెక్ట్‌ 37 శాతం పనులు పూర్తయ్యాయి. 2014లో టన్నెలింగ్‌ పనులు ప్రారంభం కాగా, 2019 తొలి క్వార్టర్‌లో దోహా మెట్రో ప్రాజెక్ట్‌ తొలి దశ పూర్తి కానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com