మొబైల్ టూరిజం స్టేషన్ ప్రాజెక్ట్ ప్రారంభం
- March 21, 2016
ఖరీఫ్ టూరిస్ట్ సీజన్లో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ టూరిజం మొబైల్ టూరిజం స్టేషన్ ప్రాజెక్ట్ని ప్రారంభించింది. స్మాల్ అండ్ మీడియమ్ ఎంటర్ప్రైజెస్ (ఎస్ఎంఇ)కు సపోర్ట్గా ఉండేందుకోసం మినిస్ట్రీ ఆఫ్ టూరిజం ఈ ప్రాజెక్ట్ని తెరపైకి తెచ్చింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా దేశంలో టూరిజం రంగం అభివృద్ధి చెందుతుందని మినిస్ట్రీ ఆఫ్ టూరిజం వర్గాలు వెల్లఇంచాయి. దోఫార్ డిప్యూటీ గవర్నర్ అబ్దుల్లా బిన్ అకీల్ అల్ ఇబ్రహీమ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సలాహ్ మెథనాల్ ఆర్థిక సహకారంతో, రియాదా (పబ్లిక్ అథారిటీ ఫర్ ఎస్ఎంఇ డెవలప్మెంట్), అల్ రఫ్ద్ ఫండ్, సలాహ్ పోర్ట్, దోఫార్ మున్సిపాలిటీ మరియు హ్యాండిక్రాఫ్ట్స్ ఇండస్ట్రీస్ ఇన్ దోఫార్ ఎడ్మినిస్ట్రేషన్ సహకారంతో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. సలాహ్లో మొత్తం ఏడు మొబైల్ టూరిజం స్టేషన్స్ ఉంటాయి. వీటిల్లో రెండు ఫుడ్ మరియు బెవరేజెస్ని సప్లయ్ చేస్తాయి. మరో రెండు స్టేషన్స్లో సంప్రదాయ హ్యాండిక్రాఫ్ట్స్ని ప్రదర్శించడం, మరియు అమ్మకం చేపడ్తాయి. రెండు స్టేషన్స్ రిఫ్రెష్మెంట్స్ని, ఒక స్టేషన్ టూరిజం సర్వీసెస్ మరియు సమాచారాన్ని అందిస్తుంది. లోకల్ ఎకానమీని పెంచడం, అలాగే ఎంప్లాయీస్ మరియు ఎస్ఎంఇ ఓనర్స్కి ప్రాక్టికల్ మరియు టెక్నికల్ ట్రెయినింగ్ అందించేలా తీర్చిదిద్దబడింది ఈ ప్రోగ్రామ్. సీజనల్గా ఈ స్టేషన్స్ని నిర్వహిస్తారు.
తాజా వార్తలు
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!







