తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ముగిసింది
- March 21, 2016తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో సినిమా పరిశ్రమ అభివృద్ధిపై చర్చించారు. ఆన్లైన్ టికెట్ల విధి విధానాల ఖరారుకు కమిటీ ఏర్పాటు చేయాలని, చిన్న సినిమాలకు ఊతం ఇచ్చేందుకు ఐదో షోను సా. 4 నుంచి ప్రదర్శించుకునే అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. 50 థియేటర్లలోపు విడుదలైతే చిన్న సినిమాగా గుర్తించాలన్నారు. సినిమాలకు ఇచ్చే అవార్డు పేరును ఎంపిక చేసేందుకు ప్రభుత్వ సలహదారు రమణాచారి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. ఫిల్మ్ ఇనిస్టిట్యూట్, స్థలం ఎంపికకు సినీ ప్రముఖులతో కమిటీ ఏర్పాటు చేయాలని ఈ భేటిలో నిర్ణయించారు. చిత్రపురి కాలనీ కోసం మరో 9 ఎకరాలు కేటాయించాలని కమిటీ నిర్ణయించింది. దీనిపై నివేదిక ఇవ్వాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ను సబ్కమిటీ ఆదేశించింది. థియేటర్లు లేని 150 మండల కేంద్రాల్లో 200లోపు సీట్లతో చిన్న థియేటర్ల నిర్మాణానికి అవకాశం ఇవ్వాలని కమిటీ అభిప్రాయపడింది. సినిమాలకు 48 గంటల్లోగా సింగిల్విండో విధానంతో అనుమతి ఇవ్వాలని, ఏ కారణం చూపకపోతే అనుమతి ఇచ్చినట్టు భావించాలని సబ్ కమిటీ నిర్ణయించింది.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు