ఎస్పీ చరణ్ సారథ్యంలో 'పాడుతా తీయగా'

- November 15, 2021 , by Maagulf
ఎస్పీ చరణ్ సారథ్యంలో \'పాడుతా తీయగా\'

25 ఏండ్ల క్రితం ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం చేతుల మీదుగా ప్రారంభమైన పాడుతా తీయగా కార్యక్రమం ఎంతో పెద్ద హిట్టయిందో అందరికీ తెలిసిందే.

ఎందరో యువ గాయకులను ఈ కార్యక్రమం సమాజానికి పరిచయం చేసిందని తెలిపారు. 18 సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకొన్న ఈ కార్యక్రమం 19వ సీజన్ త్వరలో ప్రారంభం కానుందని ఈటీవీ ప్రకటించింది. ఈ సీజన్ కోసం భారీ కసరత్తు చేస్తున్నట్లు పేర్కొంది. ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మరణించడంతో ఇప్పుడు ఆయన కుమారుడు ఎస్‌పీ చరణ్ ఈ కార్యక్రమ బాధ్యతను స్వీకరిస్తున్నట్టు తెలిపింది.

కరోనా దృష్ట్యా ఆన్‌లైన్‌ ఆడిషన్స్ నిర్వహించింది. 4 వేలమంది గాయనీగాయకుల స్వరాలను నిర్ణేతల పరీక్షించి వారిలో నుంచి 16 మంది కళాకారులను ఎంపిక చేసినట్లు తెలిపింది. బాలు తొలి వర్థంతి రోజున రామోజీరావు చేతుల మీదుగా ఎస్పీ చరణ్‌ మైక్‌పీస్ అందుకున్నారని తెలిపింది. మేటి గాయకులను ఎంపిక చేసేందుకు సినీ సంగీత సామ్రాజ్యంలో సెలబ్రిటీలుగా ఎదిగిన చంద్రబోస్, సునీత, విజయ్‌ప్రకాష్‌లు పాడుతా తీయగా జడ్జిలుగా వ్యవహరించబోతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com