కన్నీళ్లు పెట్టుకున్న శ్రీరాముడు..ఆందోళనలో భక్తులు
- November 15, 2021విగ్రహాలు పాలు తాగడం, విభూతి రాల్చడం వంటి వాటి గురించి గతంలో విన్నాం. వాటిపై వచ్చిన కథనాలు చదివాం. కంచిలోని నటరాజ స్వామి వారి ఆలయంలోని విగ్రహానికి చెమట్లు పడుతుంటాయనే సంగతి ఆ దేవాలయాన్ని దర్శించిన భక్తులకు తెలుసు.
అలా ఎందుకు జరుగుతుందనేది రహస్యం. ఎవరూ చెప్పలేకపోతున్నారు. కాగా, ఇప్పుడు ప్రకాశం జిల్లాలోని కొనకమిట్ల మండలంలో మునగపాడు గ్రామంలో రామాలయం ఉంది. ఆ ఆలయంలోని రాములవారి విగ్రహం కంటి నుంచి నీరు కారుతున్నది.
గర్భగుడిలోని రాములవారు, సీతాదేవి, లక్ష్మణుడు, హనుమంతుని విగ్రహాల నుంచి కన్నీరు కారుతుండటంతో గ్రామంలోని ప్రజలు ఆందోళన చెందారు. ఉదయం నుంచి రాత్రి వరకు కన్నీరు కారుతూనే ఉన్నదని, రాత్రి పూజలు పూర్తైన తరువాత కన్నీరు ఆగిపోయిందని, గ్రామంలో ఆలయాన్ని నిర్మించి వందేళ్లు దాటిపోయిందని, కరోనా కారణంగా గత రెండేళ్లుగా రామాలయంలో కళ్యాణం నిర్వహంచికపోవడం వలనే ఇలా జరిగి ఉండొచ్చని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం. ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా
- అరబ్ సమ్మిట్. గాజా సంక్షోభం, పాలస్తీనా గుర్తింపుపై ఫోకస్..!