తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడిగా గెలిచిన కాశీ విశ్వనాథ్
- November 15, 2021హైదరాబాద్: నవంబర్ 14వ తేదీ ఆదివారం తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం ఎన్నికలు జరిగాయి.ఇందులో దర్శకుడు కాశీ విశ్వనాథ్ కు చెందిన ప్యానెల్ జయకేతనం ఎగురవేసింది. అత్యధిక మంది సభ్యులు ఆయన ప్యానెల్ నుండి ఎన్నిక కావడం విశేషం.ఇక సముద్ర, చంద్రమహేశ్ ప్యానెల్స్ నుండి ఇద్దరు చొప్పున ఈ ఎన్నికల్లో గెలుపొందారు.మహిళా రిజర్వేషన్ కోటాలో ఇద్దరు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు.
తాజా ఎన్నికల్లో అధ్యక్షుడిగా కాశీ విశ్వనాథ్, ప్రధాన కార్శదర్శిగా వి.ఎన్. ఆదిత్య, కోశాధికారిగా భాస్కర్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా మేర్లపాక గాంధీ, జీ.ఎస్. రావు; సంయుక్త కార్యదర్శులుగా కృష్ణమోహన్ అనుమోలు, పెండ్యాల రామారావు; కార్యనిర్వహణ కార్యదర్శులుగా కొల్లి రాంగోపాల్, దొండపాటి వంశీ కృష్ణ ఎన్నికయ్యారు.కార్యవర్గ సభ్యులుగా గుంటూరు అంజిబాబు, అల్లా బక్ష్, పి. వి. రమేశ్ రెడ్డి, కాటూరి రాఘవ, ఇ.ప్రేమ్ రాజ్, నీలం సాయి రాజేశ్, ఎం. సాయి సురేంద్ర బాబు, కూరపాటి రామారావు ఎన్నికయ్యారు.మహిళల కేటగిరిలో సౌజన్య, ప్రవీణలను ఎంపిక చేశారు. ఈ నూతన కార్యవర్గం ఈ నెల 18న ప్రమాణస్వీకారం చేయనుంది.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..