యూఏఈ, సౌదీ, ఖతార్ దేశాల నుంచి వ్యాక్సినేషన్ పొందిన ప్రయాణీకుల్ని అనుమతించనున్న సింగపూర్

- November 16, 2021 , by Maagulf
యూఏఈ, సౌదీ, ఖతార్ దేశాల నుంచి వ్యాక్సినేషన్ పొందిన ప్రయాణీకుల్ని అనుమతించనున్న సింగపూర్

ఖతార్: క్వారంటైన్ లేకుండా ప్రయాణీకుల్ని అనుమతించేందుకు సింగపూర్ సన్నాహాలు చేస్తోంది. వ్యాక్సిన్ పొందిన ప్రయాణీకులకు ఈ అవకాశం కల్పిస్తారు. యూఏఈ, ఇండియా, ఇండోనేసియా మరియు సౌదీ అరేబియా దేశాలకు చెందినవారిని అనుమతించనున్నారు. నవంబర్ 29 నుంచి వ్యాక్సిేషన్ పొందిన ప్రయాణీకుల్ని ఇండియా, ఇండోనేసియా నుంచి సింగపూర్‌కి అనుమతిస్తారు. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరియు ఖతార్ నుంచి వచ్చేవారికి డిసెంబర్ 6 నుంచి అనుమతిస్తారు. 12 ఏళ్ళ లోపు చిన్నారులు తమ తల్లిదండ్రులతో వెళ్ళవచ్చు. షార్ట్ టెర్మ్ విజిటర్లు లాంగ్ టెర్మ్ పాస్ కలిగినవారి అప్లికేషన్లు నవంబర్ 22 నుంచి (ఇండియా, ఇండోనేసియా) ప్రారంభమవుతాయి. యూఏఈ, ఖతార్, సౌదీ అరేబియాకి చెందినవారికి నవంబర్ 29 నుంచి దరఖాస్తు చేసుకునే అవకాశం వుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com