2022 నుంచి ఉద్యోగులు ఒకరి కంటే ఎక్కువమంది యజమానుల వద్ద పనిచేయొచ్చు

- November 16, 2021 , by Maagulf
2022 నుంచి ఉద్యోగులు ఒకరి కంటే ఎక్కువమంది యజమానుల వద్ద పనిచేయొచ్చు

యూఏఈ: 2022 ఫిబ్రవరి 2 నుంచి ఉద్యోగులు, ఒకరి కంటే ఎక్కువమంది యజమానుల వద్ద పని చేయొచ్చు. ఈ మేరకు కొత్త లేబర్ చట్టం ప్రకటితమైంది. ఫెడరల్ చట్టం 33 - 201 ప్రకారం, ప్రైవేటు సెక్టారులోని ఉద్యోగులు పార్ట్ టైమ్, తాత్కాలికం లేదా ఫ్లెక్సిబుల్ విధానంలో పని చేయవొచ్చు. రెగ్యులర్ పార్ట్ టైమ్ స్కీమ్ ద్వారా ఉద్యోగుల హక్కులను పరిరక్షించేలా రెండు మార్గాల్లో అవకాశం కల్పిస్తున్నారు. పని కోసం ప్రత్యేకంగా కేటాయించిన గంటలు, లేదా రోజుల్లో పార్ట్ టైమ్ వర్క్ ఉద్యోగులకు అనుమతించబడుతుంది. ప్రత్యేక సమయానికి తాత్కాలికంగా పని అవకాశం కల్పిస్తారు. ఫ్లెక్సిబుల్ వర్క్ ద్వారా ఉద్యోగులకు చాలా వెసులుబాటు కలుగుతుంది. యజమానికి సంబంధించి పనికి తగ్గట్టుగా ఇది సులభతరంగా వుంటుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com