ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్: ఫ్రీ ఫుడ్
- March 22, 2016
ఇండియాకి చెందిన బడ్జెట్ ఎయిర్లైన్స్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, యూఏఈకి మరిన్ని విమానాల్ని నడపాలనుకుంటోంది. యూఏఈ నుంచి ముంబై మరియు ఢిల్లీకి ప్రయాణించే విమానాల సంఖ్యను రెండింతలకు పెంచాలన్నది ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఆలోచన. వారానికి మొత్తం 107 విమానాలు నడుస్తుండగా, వాటి సంఖ్యను 146కి పెంచాలనుకుంటున్నారు. వారానికి రెండుసార్లు ముంబైకి మరియు ఢిల్లీకి నడిచే విమాన సర్వీసు వచ్చే నెలలో ప్రారంభం కానుంది. గతంలో విమానాల రద్దు కారణంగా ప్రయాణీకుల నుంచి విమర్శలు ఎదుర్కొంది. ఇండియాలోని 12 ప్రముఖ నగరాల్ని యూఏఈలోని నాలుగు ఎమిరేట్స్తో కలిపేందుకు కొత్తగా బోయింగ్ 737 ఎయిర్క్రాఫ్ట్ని లీజ్కి తీసుకుందని ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కె.శ్యామ్సుందర్ చెప్పారు. దుబాయ్ - ముంబై, షార్జా - ముంబై రోజువారీ విమానాలు ఏప్రిల్ 7 నుంచి ప్రారంభం కానున్నాయి. ఢిల్లీ - అబుదాబీ, ఢిల్లీ - దుబాయ్ సర్వీసులు మే 15, మే 16న ప్రారంభమవుతాయి. కేరళ సెక్టార్కి సంబంధించినంతవరకు వారానికి 96 విమానాల నుంచి 119 విమానాలకు పెంచనున్నారు. తమ విమానాల్లో ఆన్లైన్ ద్వారా ఉచిత భోజన సదుపాయం కల్పిస్తున్నట్లు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







