పోచారం మనవరాలి వివాహానికి హాజరైన జగన్, కేసీఆర్

- November 21, 2021 , by Maagulf
పోచారం మనవరాలి వివాహానికి హాజరైన జగన్, కేసీఆర్

హైదరాబాద్: సీఎం కేసీఆర్, జగన్ కలిశారు. జలవివాదం తర్వాత తొలిసారి కలుసుకున్న సీఎంలు.. పక్కపక్కనే కూర్చుని ఆప్యాయంగా మాట్లాడుకున్నారు.ఈ సీన్ అంతా తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మనువరాలి పెళ్లిలో జరిగింది.శంషాబాద్లో జరిగిన వివాహవేడుకకు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి హాజరయ్యారు సీఎంలు.నూతన దంపతులు స్నిగ్దారెడ్డి, రోహిత్ రెడ్డిలను ఆశీర్వదించారు. పోచారం కుటుంబసభ్యుల్ని దగ్గరుండి సీఎం జగన్ కు పరిచయం చేశారు కేసీఆర్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com