దుబాయ్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ వద్ద కెమెరాలు
- March 22, 2016
దుబాయ్ మునిసిపాలిటీ ఇకపై కన్స్ట్రక్షన్ సైట్స్ వద్ద సర్వైలెన్స్ కెమెరాలను తప్పనిసరిగా వినియోగించాలని ఆదేశాలు జారీ చేసింది. టవర్ క్రేన్లపై ఈ కెమెరాలను వినియోగించవలసి ఉంటుంది. మొత్తం సైట్ అంతా ఈ కెమెరాల ద్వారా వీక్షించేలా ఉండాలి. సర్కులర్ నెంబర్ 211, 2016 ప్రకారం ఈ కొత్త ఆదేశాలను జారీ చేశారు. నాలుగు కెమెరాలకు తక్కువ కాకుండా కన్స్ట్రక్షన్స్ సైట్ వద్ద కెమెరాలను వినియోగించడం తప్పనిసరి. 'భద్రతతో కూడిన పని'లో భాగంగా ఈ చర్యలను చేపట్టాల్సి ఉంటుంది. దుబాయ్లో ప్రస్తుతం 53.6 బిలియన్ డాలర్ల విలువైన కన్స్ట్రక్షన్స్ ప్రాజెక్టులు జరుగుతున్నాయి. క్రేన్ ఆపరేటర్స్కి కిందనున్న పనివారికీ మధ్య కమ్యూనికేషన్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రమాదాలను నివారించే అవకాశం ఉంది. కెమెరాల ద్వారా పరిస్థితిని సమీక్షించడం భద్రతా చర్యల్లో ముఖ్య భాగం. అలాగే రహదార్లపై ట్యాక్సీలు, ఇతర వాహనాలలో కెమెరాలను ఏర్పాటు చేయడం ద్వారా ప్రమాదాలకు కారణాల్ని విశ్లేషించడానికి వీలవుతోంది. అలాగే దొంగతనాలూ తగ్గుతున్నాయి. ఈ చర్యలను ఇప్పటికే దుబాయ్ మునిసిపాలిటీ తీసుకుంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







