2017 నాటికి ట్రయల్ మరియు టెస్టింగ్: దోహా మెట్రో రైల్
- March 22, 2016
దోహా మెట్రో రైల్కి సంబంధించి ట్రయల్, టెస్టింగ్ 2017 చివరి నాటికి జరగవచ్చని ఖతార్ రైల్ సీనియర్ అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది చివరి నాటికి మెట్రో రైల్ కోచ్లు దిగుమతయ్యే అవకాశం ఉందని ఖతార్ రైల్ మేనేజింగ్ డైరెక్టర్ అబ్దుల్లా అబ్దుల్ అజీజ్ అల్ సబాయి చెప్పారు. 40 స్టేషన్లతో 108 కిలోమీటర్ల మేర తొలి ఫేజ్ని 2019 చివరి నాటికి అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. నార్తరన్ సెక్షన్లోని 42 కిలోమీటర్ల మేర లాంగ్ రెడ్ లైన్ టన్నెలింగ్ వర్క్ పూర్తయ్యిందనీ, వీలైనంత వేగంగా మెకానికల్, ఎలక్ట్రికల్, సిగ్నలింగ్ పనుల్ని చేపడ్తామని అన్నారు. మొత్తం కాంట్రాక్టుల్లో 70 శాతం లోకల్ కాంట్రాక్టర్ల చేతుల్లోనే ఉన్నాయనీ, పనులు శరవేగంగా జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. దోహా మెట్రో ప్రాజెక్ట్ కోసం 21 టన్నెల్ బోరింగ్ మెషీన్లను వినియోగిస్తుండడం గిన్నీ వరల్డ్ రికార్డ్గా అధికారులు అభివర్ణించారు.
తాజా వార్తలు
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









