2017 నాటికి ట్రయల్ మరియు టెస్టింగ్: దోహా మెట్రో రైల్
- March 22, 2016
దోహా మెట్రో రైల్కి సంబంధించి ట్రయల్, టెస్టింగ్ 2017 చివరి నాటికి జరగవచ్చని ఖతార్ రైల్ సీనియర్ అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది చివరి నాటికి మెట్రో రైల్ కోచ్లు దిగుమతయ్యే అవకాశం ఉందని ఖతార్ రైల్ మేనేజింగ్ డైరెక్టర్ అబ్దుల్లా అబ్దుల్ అజీజ్ అల్ సబాయి చెప్పారు. 40 స్టేషన్లతో 108 కిలోమీటర్ల మేర తొలి ఫేజ్ని 2019 చివరి నాటికి అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. నార్తరన్ సెక్షన్లోని 42 కిలోమీటర్ల మేర లాంగ్ రెడ్ లైన్ టన్నెలింగ్ వర్క్ పూర్తయ్యిందనీ, వీలైనంత వేగంగా మెకానికల్, ఎలక్ట్రికల్, సిగ్నలింగ్ పనుల్ని చేపడ్తామని అన్నారు. మొత్తం కాంట్రాక్టుల్లో 70 శాతం లోకల్ కాంట్రాక్టర్ల చేతుల్లోనే ఉన్నాయనీ, పనులు శరవేగంగా జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. దోహా మెట్రో ప్రాజెక్ట్ కోసం 21 టన్నెల్ బోరింగ్ మెషీన్లను వినియోగిస్తుండడం గిన్నీ వరల్డ్ రికార్డ్గా అధికారులు అభివర్ణించారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









