2017 నాటికి ట్రయల్ మరియు టెస్టింగ్: దోహా మెట్రో రైల్
- March 22, 2016
దోహా మెట్రో రైల్కి సంబంధించి ట్రయల్, టెస్టింగ్ 2017 చివరి నాటికి జరగవచ్చని ఖతార్ రైల్ సీనియర్ అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది చివరి నాటికి మెట్రో రైల్ కోచ్లు దిగుమతయ్యే అవకాశం ఉందని ఖతార్ రైల్ మేనేజింగ్ డైరెక్టర్ అబ్దుల్లా అబ్దుల్ అజీజ్ అల్ సబాయి చెప్పారు. 40 స్టేషన్లతో 108 కిలోమీటర్ల మేర తొలి ఫేజ్ని 2019 చివరి నాటికి అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. నార్తరన్ సెక్షన్లోని 42 కిలోమీటర్ల మేర లాంగ్ రెడ్ లైన్ టన్నెలింగ్ వర్క్ పూర్తయ్యిందనీ, వీలైనంత వేగంగా మెకానికల్, ఎలక్ట్రికల్, సిగ్నలింగ్ పనుల్ని చేపడ్తామని అన్నారు. మొత్తం కాంట్రాక్టుల్లో 70 శాతం లోకల్ కాంట్రాక్టర్ల చేతుల్లోనే ఉన్నాయనీ, పనులు శరవేగంగా జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. దోహా మెట్రో ప్రాజెక్ట్ కోసం 21 టన్నెల్ బోరింగ్ మెషీన్లను వినియోగిస్తుండడం గిన్నీ వరల్డ్ రికార్డ్గా అధికారులు అభివర్ణించారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







