భారత్ నుంచి ఆఫ్ఘన్ వెళ్లే వాహనాలకు అనుమతి...
- November 25, 2021
భారత్ కు పాక్ గుడ్న్యూస్ చెప్పింది.భారత్ నుంచి ఆఫ్ఘనిస్తాన్కు వెళ్లే వాహనాలకు అనుమతిస్తూ పాక్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.మానవతా దృక్పదంతోనే వాహనాలకు అనుమతులు ఇస్తున్నట్టు ప్రకటించింది.ఆఫ్ఘనిస్తాన్ను తాలిబన్లు ఆక్రమించుకున్నాక అక్కడ పరిస్థితులు దారుణంగా మారిపోయాయి.ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.సరైనా ఆహారం అందక అలమటిస్తున్నారు.ఆఫ్ఘనిస్తాన్కు సాయం చేసేందుకు అనేక దేశాలు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
కాగా, భారత్ కూడా ముందుకు వచ్చి 50వేల మెట్రిక్ టన్నుల గోధుమలను అందించేందుకు సిద్ధమైంది.అయితే, ఈ గోధుమలను భారత్ నుంచి పాక్ మీదుగా ఆఫ్ఘనిస్తాన్కు చేరవేయాల్సి ఉంది.గోధుమలతో పాటుగా మెడిసిన్ను కూడా సరఫరా చేసుందుకు భారత్ ముందుకు వచ్చింది.మానవతా దృక్పథంతో అనుమతులు ఇస్తున్నామని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈరోజు తెలియజేశారు.దీంతో సుమారు 500 లారీలు భారత్ నుంచి ఆఫ్ఘన్కు వెళ్లేందుకు మార్గం సుగమం అయింది.
తాజా వార్తలు
- తెలంగాణ: అసెంబ్లీలో హేట్ స్పీచ్ బిల్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం
- నేవీ చీఫ్ మృతిని కన్ఫర్మ్ చేసిన ఇరాన్
- నాయుడుపేటలో టిడ్కో ఇళ్లను పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు
- రియాద్లో హౌజ్ హోల్డ్ డెమోగ్రాఫిక్ సర్వే ప్రారంభం..!!
- యూఏఈలో ఇంధన ధరలు పెరుగుతాయా?
- బ్రోకరేజ్ సంస్థల పై నియంత్రణ విధించాలని ఎంపీల పిలుపు..!!
- ఒమన్ లో రాబోయే మూడు రోజులపాటు వర్షాలు..!!
- ఖతార్ లో మూడు ప్రముఖ ఆహార సంస్థలు మూసివేత..!!
- పెరంబూర్ నుంచి నామినేషన్ వేసిన దళపతి విజయ్
- కువైట్లో నీటి శుద్ధీకరణ కేంద్రం పై దాడి..భారతీయ కార్మికుడు మృతి









