తమిళనాడులో భారీ వర్షాలు...చెన్నై విమానాశ్రయం మూసివేత
- November 25, 2021
చెన్నై: తమిళనాడులో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి.బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనం ప్రభావంతో తమిళనాడు,రాయసీమలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన సంగతి తెలిసిందే.వాతావరణ శాఖ హెచ్చరించినట్టుగానే తూత్తుకుడి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.దీంతో ఆ జిల్లా వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించారు.ఇక చెన్నైనగరంలో ఈ ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది.
ఇప్పటి వరకు 200 మీ.మీ వర్షపాతం నమోదైంది.భారీ వర్షం కారణంగా చెన్నై విమానాశ్రయంలో విమానాల రాకపోకలు బంద్ అయ్యాయి.పలు విమానాలను దారి మళ్లించారు.రన్వేపైకి భారీగా వరదనీరు చేరడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.మరో మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ముందు అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
తాజా వార్తలు
- సోషల్ మీడియాకు KYC తప్పనిసరి..
- ఏపీ ప్రజలకు హెచ్చరిక..3 నెలలు తీవ్రమైన ఎండలు, వడగాలులు..
- లేపాక్షి రాయితీ అమ్మకాలకు విశేష స్పందన
- ఆయుష్మాన్ భారత్..రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స...
- వైజాగ్ ఆర్కే బీచ్లో కేఎఫ్సీ..ఇసుకతో భారీ ‘బకెట్’ ఆవిష్కరణ!
- మహిళా రిజర్వేషన్ల బిల్లులో ఓబీసీ సబ్ కోటా తప్పనిసరి: కల్వకుంట్ల కవిత
- యురేనియం నిల్వల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- ఇరాన్కు అమెరికా పలు కీలక ప్రతిపాదనలు..అందులో ఏమున్నాయంటే?
- ఈయూ పార్లమెంట్ అధ్యక్షురాలితో జీసీసీ రాయబారులు భేటీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్ళు..హెచ్చరికలు జారీ..!!









