మహజూజ్ డ్రాలో జాక్పాట్ కొట్టిన భారతీయ మహిళ..
- November 26, 2021దుబాయ్: మహజూజ్ వీక్లీ లక్కీ డ్రాలో భారత మహిళ ఒకరు జాక్పాట్ కొట్టారు.లాటరీ టికెట్ కొన్న మొదటిసారినే ఆమెకు ఇలా అదృష్టం వరించడం విశేషం. దీంతో ఆమె లక్ష దిర్హమ్స్ గెలుచుకున్నారు.దుబాయ్లో గురువారం నిర్వహించిన మహజూజ్ 52వ వీక్లీ డ్రాలో ఈ ముగ్గురు ప్రవాసులు చెరో 100,000 దిర్హమ్స్ గెలుచుకున్నారు. భారత్కు చెందిన విద్య(31), లెబనాన్ పౌరులైన సుజానే(51), చార్బెల్(35) ఈ లక్కీ డ్రాలో విజేతలుగా నిలిచారు.
విద్య మాట్లాడుతూ.. మహజూజ్ లాటరీలో పాల్గొన్న తొలిసారి ఇలా భారీ మొత్తం గెలుచుకోవడం ఆనందంగా ఉందన్నారు. ర్యాఫిల్ ఐడీ నం:8131197 తనకు అదృష్టాన్ని తెచ్చిపెట్టిందని హర్షం వ్యక్తం చేశారు. ఇక తాను గెలిచిన ప్రైజ్మనీలో అధిక భాగం తన కూతురి భవిష్యత్తు కోసం వినియోగిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మహజూజ్ నిర్వాహకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. కాగా, విద్య షార్జాలో సర్వీస్ కోఆర్డినేటర్గా పని చేస్తున్నారు. అటు మరో మహిళ విజేత సుజానే సైతం భారీ మొత్తం గెలుచుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. తాను గెలిచిన నగదులో కొంత మొత్తం చారిటీకి ఉపయోగిస్తానన్నారు. ఆమె అబుధాబిలో ఓ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం
- దుబాయ్లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..