ఏపీ అసెంబ్లీ ఘటనపై స్పందించిన నారా భువనేశ్వరి..!
- November 26, 2021ఏపీ: నారా భువనేశ్వరి మౌనం వీడారు.ఏపీ అసెంబ్లీలో తనపై చేసిన వ్యాఖ్యలకు నారా భువనేశ్వరి స్పందించారు.ఈ వ్యాఖ్యల పై ప్రెస్ నోట్ విడుదల చేసారు. అందులో… ఆంధ్రప్రదేశ్ శాసనసభలో నాపై చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల నిరసన వ్యక్తం చేసిన వారందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. నాకు జరిగిన అవమానాన్ని మీ తల్లికి, తోబుట్టువుకు, కూతురికి జరిగినట్టుగా భావించి నాకు అండగా నిలబడటం నా జీవితంలో మర్చిపోలేను అన్నారు. చిన్నతనం నుంచి అమ్మ, నాన్న మమ్మల్ని విలువలతో ఉంటారు. నేటికీ మేము వాటిని పాటిస్తున్నాం. విలువలతో కూడిన సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలిఅని తెలిపారు. కష్టాల్లో ఆపదలో ఉన్న వారికి అండగా నిలబడాలి అని సూచించారు. ఇతరుల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా, గౌరవానికి భంగం కలిగించేలా ఎవరూ వ్యవహరించకూడదు. నాకు జరిగిన ఈ అవమానం మరెవరికీ జరగకుండా ఉండాలని ఆశిస్తున్నాను అని అందులో పేర్కొన్నారు నారా భువనేశ్వరి.
తాజా వార్తలు
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!
- యువ రైతులకు ప్రేరణగా యూఏఈ మొదటి మహిళా రైతు..!
- సోషల్ మీడియాలో పోస్ట్..బ్లాగర్కు ఐదేళ్ల జైలుశిక్ష
- మెసాయిద్లో అంతర్జాతీయ స్థాయి పబ్లిక్ పార్క్ ప్రారంభం
- పాట్నాలోని ఓ హోటల్లో భారీ అగ్నిప్రమాదం..6 గురు మృతి..
- నాలుగో విడత ఎన్నికలు..ముగిసిన నామినేషన్ల గడువు