15 డిసెంబర్ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసుల పునఃప్రారంభం
- November 26, 2021న్యూ ఢిల్లీ: కరోనావైరస్ నేపథ్యంలో గతేడాది మార్చి 23 నుంచి నిలిచిపోయిన షెడ్యూల్డ్ అంతర్జాతీయ విమాన సర్వీసులను డిసెంబర్ 15 నుంచి పూర్తి స్థాయిలో పునరుద్ధరిస్తామని శుక్రవారం పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది.కేంద్రహోంశాఖ,ఆరోగ్యశాఖ,విదేశాంగశాఖతో సంప్రదింపుల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.కాగా,గత వారం పౌర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా..అంతర్జాతీయ విమాన సేవలను తిరిగి సాధారణ స్థితికి(కోవిడ్ పూర్వ స్థితికి) తీసుకొచ్చే ప్రక్రియపై కేంద్రప్రభుత్వం పనిచేస్తున్నట్లు చెప్పిన విషయం తెలిసిందే.
ఇక,28 దేశాలతో కుదుర్చుకున్న ఎయిర్ బబుల్ బప్పందంలో భాగంగా కొన్ని నిర్దేశించిన దేశాలకు మాత్రమే ప్రస్తుతం భారత్ నుంచి పరిమిత సంఖ్యలో ప్రత్యేక అంతర్జాతీయ విమాన సర్వీసులు కొనసాగుతున్న విషయం తెలిసిందే.మరోవైపు,కోవిడ్ కారణంగా గతేడాది మార్చి నుంచి ఆంక్షలను ఎదుర్కొన్న దేశీయ విమాన సేవలు..గత నెల నుంచి పూర్తిస్థాయిలో అనుమతించబడిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్