బుర్జ్ ఖలీఫా మీద ఆర్జీవీ ట్రైలర్
- November 28, 2021దుబాయ్:ప్రముఖ దర్శకుడు రాం గోపాల్ వర్మ దర్శకత్వంలో వస్తున్న లడ్కీ- ఎంటర్ ది గర్ల్ డ్రాగన్ అనే సినిమా ట్రైలర్ నేడు బుర్జ్ ఖలీఫా మీద ప్రదర్శింపబడింది.ఈ ప్రతిష్టాత్మకమైన ప్రపంచ ప్రసిద్ధ కట్టడం మీద ప్రదర్శింపబడిన తొలి హిందీ చిత్రం ట్రైలర్ ఇదే కావడం గమనార్హం.
దర్శకుడు రాం గోపాల్ వర్మ,చిత్ర కథానాయిక పూజా నేడు ఈ కార్యక్రమానికి విచ్చేసారు.
"ఇంత గొప్ప మానవ నిర్మితమైన బుర్జ్ ఖలీఫా మీద నా చిత్రం ట్రైలర్ ప్రదర్శింపబడడం గర్వంగా ఉంది.ఇది బ్రూసిలీకి దక్కిన సరైన గౌరవం అని నేను అనుకుంటున్నాను" అని రాం గోపాల్ వర్మ అన్నారు.
బ్రూస్లీ నేపథ్యంగా తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే విశేషమైన ప్రచారం జరుపుకుంది.చైనీస్ ఉపశీర్షికలతో (సబ్టైటిల్స్) ఈ చిత్రం చైనాలో ఏకంగా 30,000 థియేటర్ల లో విడుదలవుతోంది. చైనాలో అత్యధిక సినిమా హాల్స్ లో విడుదలవుతున్న తొలి భారతీయ
చిత్రంగా అరుదైన గౌరవాన్ని కూడా ఈ చిత్రం పొందుతోంది.
తాజా వార్తలు
- మే 13న నాలుగో విడత పోలింగ్..
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వారాంతంలో మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం