బుర్జ్ ఖలీఫా మీద ఆర్జీవీ ట్రైలర్
- November 28, 2021
దుబాయ్:ప్రముఖ దర్శకుడు రాం గోపాల్ వర్మ దర్శకత్వంలో వస్తున్న లడ్కీ- ఎంటర్ ది గర్ల్ డ్రాగన్ అనే సినిమా ట్రైలర్ నేడు బుర్జ్ ఖలీఫా మీద ప్రదర్శింపబడింది.ఈ ప్రతిష్టాత్మకమైన ప్రపంచ ప్రసిద్ధ కట్టడం మీద ప్రదర్శింపబడిన తొలి హిందీ చిత్రం ట్రైలర్ ఇదే కావడం గమనార్హం.
దర్శకుడు రాం గోపాల్ వర్మ,చిత్ర కథానాయిక పూజా నేడు ఈ కార్యక్రమానికి విచ్చేసారు.
"ఇంత గొప్ప మానవ నిర్మితమైన బుర్జ్ ఖలీఫా మీద నా చిత్రం ట్రైలర్ ప్రదర్శింపబడడం గర్వంగా ఉంది.ఇది బ్రూసిలీకి దక్కిన సరైన గౌరవం అని నేను అనుకుంటున్నాను" అని రాం గోపాల్ వర్మ అన్నారు.
బ్రూస్లీ నేపథ్యంగా తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే విశేషమైన ప్రచారం జరుపుకుంది.చైనీస్ ఉపశీర్షికలతో (సబ్టైటిల్స్) ఈ చిత్రం చైనాలో ఏకంగా 30,000 థియేటర్ల లో విడుదలవుతోంది. చైనాలో అత్యధిక సినిమా హాల్స్ లో విడుదలవుతున్న తొలి భారతీయ
చిత్రంగా అరుదైన గౌరవాన్ని కూడా ఈ చిత్రం పొందుతోంది.

_1638123596.jpg)
తాజా వార్తలు
- వాట్సాప్లోనే ఈ-ఆధార్ డౌన్లోడ్.. కొత్త సర్వీస్!
- హర్మూజ్ జలసంధిని తెరవాలని ఇరాన్కు 20 దేశాల విజ్ఞప్తి
- ఫ్యామిలీ డెంటల్ ప్యాకేజీలు ప్రారంభించిన మెడికవర్ హాస్పిటల్స్
- యూఏఈలో అస్థిర వాతావరణం..అబుదాబి, దుబాయ్లలో వర్షాలు..!!
- ఆసుపత్రులను తనిఖీ చేసిన హెల్త్ మినిస్టర్..!!
- ఇరాన్ దాడులు..బహ్రెయిన్ వ్యాప్తంగా సంఘీభావం వ్యక్తం..!!
- సౌదీ అరేబియాలో స్ప్రింగ్ సీజన్ ప్రారంభం..!!
- కన్షుమర్ స్పెండింగ్ పాటర్న్ ని హైలెట్ చేసిన ఈద్..!!
- మాతృ దినోత్సవం..శుభాకాంక్షలు తెలిపిన ఒమన్ మహారాణి..!!
- ఇన్విజిలేటర్ల ఫోన్లపై నిషేధం..పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ట్రాకింగ్









