సాల్మియాలో 30 వేల 'స్మార్ట్ మీటర్ల' ఇన్స్టాల్
- November 30, 2021కువైట్: సాల్మియాలో ఇప్పటివరకు వాటర్, విద్యుత్ కలెక్షన్లకు 30,000 స్మార్ట్ మీటర్లను ఇన్ స్టాల్ చేసినట్లు విద్యుత్, నీటి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇది ఈ ప్రాంతంలో అవసరమైన మీటర్లలో దాదాపు సగం మీటర్లకు సమానం. గత రెండు నెలలుగా వాటర్, విద్యుత్ కలెక్షన్లకు స్మార్ట్ మీటర్లను అమర్చుతున్న విషయం తెలిసిందే. హవల్లిలో ఒక నెలలోపు ఇన్స్టాలేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని అధికారులు చెప్పారు. మీటర్లను ఇన్స్టాల్ చేసే ప్రక్రియ వేగం పెరిగిందని, రోజుకు 1,000 మీటర్లను ఇన్ స్టాల్ చేస్తున్నట్లు అధికారులు వివరించారు. స్మార్ట్ మీటర్లను ఇన్స్టాల్ చేసిన వారందరూ తమ పాత బకాయిలు చెల్లించారని అధికార వర్గాలు కోరాయి. కరోనా మహమ్మారి సమయం కంటే ఇప్పుడు బిల్లుల వసూళ్లు పెరిగాయని అధికారులూ చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 370 మిలియన్ దినార్లను వసూలు చేయాలని మంత్రిత్వ శాఖ టార్గెట్ పెట్టగా.. ఇప్పటివరకు 300 మిలియన్ దినార్లను వసూలు చేసినట్ల అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ