తెలంగాణకు వచ్చే ప్రయాణికులపై అర్ధరాత్రి నుంచి ఆంక్షలు
- November 30, 2021హైదరాబాద్: ఒమిక్రాన్ కేసులు వెలుగు చూసిన 12 దేశాల నుంచి తెలంగాణకు వచ్చే ప్రయాణికులపై ఈ అర్ధరాత్రి నుంచి ఆంక్షలు విధించనున్నట్టు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.ఇప్పటికే తెలంగాణాలో అన్ని చోట్ల వైద్యాశాఖ అధికారులు అప్రమత్తంగా ఉన్నారన్నారు.వ్యాక్సినేషన్ డ్రైవ్ను కూడా వేగంగా చేపట్టినట్లు ఆయన తెలిపారు.రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకుని వారు వెంటనే వేసుకోవాలని ఆయన వెల్లడించారు.ఆయా దేశాల నుంచి వచ్చే ప్రయాణి కుంలందరికి ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తున్నామన్నారు. ఒకవేళ వారికి పాజిటివ్గా నిర్ధారణ అయితే గచ్చిబౌలి టీమ్స్కు తరలించనున్నట్టు తెలిపారు.
ఇప్పటి వరకు దేశంలో,రాష్ట్రంలో ఒమిక్రాన్ ప్రవేశించలేదని అసత్య ప్రచారాలను నమ్మవద్దని ఆయన కోరారు.ఎయిర్ పోర్టులో కట్టుదిట్టమైన చర్యలు అటు కేంద్ర, ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ప్రతిచోట థర్మల్ స్క్రీనింగ్లు చేస్తున్నామన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ఎవ్వరూ భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని శ్రీనివాసరావు తెలిపారు. ప్రతి ఒక్కరూ కరోనా జాగ్రత్తలు పాటించాలని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్దొద్దు: కోర్టును కోరిన సీబీఐ
- ఒమన్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్లకు మంచి రోజులు..!
- జహ్రా గవర్నర్ను కలిసిన భారత రాయబారి
- 66కు పెరిగిన సౌదీ ఇ-విజిట్ వీసా పూల్ దేశాలు
- దుబాయ్లో కొత్త ట్రాఫిక్ ప్లాన్ కు ఆమోదం
- క్యాబిన్ క్రూ సంక్షోభం.. తగ్గనున్న ఎయిర్ ఇండియా సర్వీసులు..!
- షేక్ హజ్జా బిన్ సుల్తాన్ బిన్ జాయెద్ మృతికి సంతాపం తెలిపిన యూఏఈ ప్రెసిడెంట్
- దుబాయ్ లో పెరిగిన టాక్సీ ఛార్జీలు..!
- 'డార్క్ స్కై పాలసీ' ప్రకటించిన అబుదాబి
- ఎజార్: రెంటర్స్ నుండి ప్రాపర్టీ హామీ తప్పనిసరి..!