బహ్రెయిన్ మెట్రో ప్రాజెక్టు ప్రారంభంపై రవాణా మంత్రిత్వ శాఖ ప్రకటన
- November 30, 2021
మనామా:బహ్రెయిన్ మెట్రో ప్రాజెక్టు (మొదటి ఫేజ్) విషయమై ప్రజా రవాణా విభాగంలో స్థానిక, అంతర్జాతీయ సంస్థల అర్హత టెండరుని రవాణా మరియు టెలికమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా ఈ ప్రాజెక్టుని రూపొందించారు. బహ్రెయిన్ విజన్ 2030లో భాగంగా ఈ మెట్రో ప్రాజెక్టుని చేపడుతున్నారు. మెట్రో విభాగంలో అంతర్జాతీయ స్థాయి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తారు. ప్రైవేటు విభాగంతో కలిసి పిపిపి విధానంలో ఈ ప్రాజెక్టుని చేపడతారు.మొదటి ఫేజ్ రెండు లైన్లలో మొత్తం 29 కిలోమీటర్ల మేర 20 స్టేషన్లతో నిర్మిస్తారు. ముహరాక్, మనామా, డిప్లమాటిక్ ఏరియా, జుఫ్ఫైర్, సీఫ్ డిస్ట్రిక్ట్, తుబ్లి, అధారి మరియు ఇసా టౌన్లను కలుపుతుంది మెట్రో.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









