బహ్రెయిన్ మెట్రో ప్రాజెక్టు ప్రారంభంపై రవాణా మంత్రిత్వ శాఖ ప్రకటన
- November 30, 2021మనామా:బహ్రెయిన్ మెట్రో ప్రాజెక్టు (మొదటి ఫేజ్) విషయమై ప్రజా రవాణా విభాగంలో స్థానిక, అంతర్జాతీయ సంస్థల అర్హత టెండరుని రవాణా మరియు టెలికమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా ఈ ప్రాజెక్టుని రూపొందించారు. బహ్రెయిన్ విజన్ 2030లో భాగంగా ఈ మెట్రో ప్రాజెక్టుని చేపడుతున్నారు. మెట్రో విభాగంలో అంతర్జాతీయ స్థాయి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తారు. ప్రైవేటు విభాగంతో కలిసి పిపిపి విధానంలో ఈ ప్రాజెక్టుని చేపడతారు.మొదటి ఫేజ్ రెండు లైన్లలో మొత్తం 29 కిలోమీటర్ల మేర 20 స్టేషన్లతో నిర్మిస్తారు. ముహరాక్, మనామా, డిప్లమాటిక్ ఏరియా, జుఫ్ఫైర్, సీఫ్ డిస్ట్రిక్ట్, తుబ్లి, అధారి మరియు ఇసా టౌన్లను కలుపుతుంది మెట్రో.
తాజా వార్తలు
- అబుదాబి పోలీసుల అలెర్ట్..అలా చేస్తే 1,000 దిర్హామ్ ఫైన్
- ఈద్ వేడుకల్లో అపశృతి.. 38 మందికి గాయాలు
- పాలస్తీనా శరణార్థులకు యుఎన్ఆర్డబ్ల్యుఎ మద్దతు
- తుఫాను ప్రభావిత ప్రాంత నివాసితులకు శుభవార్త..!
- NRIలకు IFSCA పెట్టుబడి అవకాశాలపై సెమినార్
- ఖతార్ సరిహద్దులో భారీగా ఆయుధాలు స్వాధీనం
- సోషల్ మీడియాలో విమర్శలు.. ఉపాధ్యాయుడికి జరిమానా
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..