బహ్రెయిన్ మెట్రో ప్రాజెక్టు ప్రారంభంపై రవాణా మంత్రిత్వ శాఖ ప్రకటన
- November 30, 2021
మనామా:బహ్రెయిన్ మెట్రో ప్రాజెక్టు (మొదటి ఫేజ్) విషయమై ప్రజా రవాణా విభాగంలో స్థానిక, అంతర్జాతీయ సంస్థల అర్హత టెండరుని రవాణా మరియు టెలికమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా ఈ ప్రాజెక్టుని రూపొందించారు. బహ్రెయిన్ విజన్ 2030లో భాగంగా ఈ మెట్రో ప్రాజెక్టుని చేపడుతున్నారు. మెట్రో విభాగంలో అంతర్జాతీయ స్థాయి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తారు. ప్రైవేటు విభాగంతో కలిసి పిపిపి విధానంలో ఈ ప్రాజెక్టుని చేపడతారు.మొదటి ఫేజ్ రెండు లైన్లలో మొత్తం 29 కిలోమీటర్ల మేర 20 స్టేషన్లతో నిర్మిస్తారు. ముహరాక్, మనామా, డిప్లమాటిక్ ఏరియా, జుఫ్ఫైర్, సీఫ్ డిస్ట్రిక్ట్, తుబ్లి, అధారి మరియు ఇసా టౌన్లను కలుపుతుంది మెట్రో.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







