బాలల హక్కుల పరిరక్షణపై రాజీ లేని పోరాటం: కువైట్

- December 03, 2021 , by Maagulf
బాలల హక్కుల పరిరక్షణపై రాజీ లేని పోరాటం: కువైట్

కువైట్:క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ జనరల్ డిపార్టుమెంట్ ప్రతినిథి షిమా అల్ అద్సాని మాట్లాడుతూ, ఎలక్ట్రానిక్ క్రైమ్ కేసుల్లో జువైనెల్ ప్రాసిక్యూషన్ ప్రత్యేకంగా జరుగుతోందని చెప్పారు. 18 ఏళ్ళ లోపు వారి విషయమై అత్యంత జాగ్రత్తగా, బాధ్యతగా వ్యవహరిస్తున్నామని పేర్కొన్నారు. పిల్లల విద్యాభ్యాసానికి సంబంధించి చిన్న చిన్న పొరపాట్ల కారణంగా సమస్యలు తలెత్తుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. ఈ సమస్యలపై అవగాహనా కార్యక్రమాల్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. నేటి బాలలే రేపటి భవిష్యత్తుకి దిశానిర్దేశం చేయగలరన్న కోణంలో వారి విషయమై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అథారిటీస్ పేర్కొన్నాయి. బాలల హక్కుల పరిరక్షణ, వారు ఎదుర్కొనే సమస్యల పట్ల స్పందన.. ఇవన్నీ అత్యంత కీలకమని అన్నారు షిమా అల్ అద్బాని.  స్కూళ్ళలో, విద్యా సంస్థల్లో అవగాహనా కార్యక్రమాలు చేపడతామని వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com