పాకిస్థాన్‌ ప్రజలకు జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు : భారత ప్రధానమంత్రి

- March 23, 2016 , by Maagulf
పాకిస్థాన్‌ ప్రజలకు జాతీయ దినోత్సవ  శుభాకాంక్షలు : భారత ప్రధానమంత్రి

పాకిస్థాన్‌ జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ దేశ ప్రజలకు భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్‌ వేదికగా పాక్‌ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ కూడా పాక్‌ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని ప్రణబ్‌ఆకాంక్షించారు. ఇరు దేశాల మధ్య స్నేహభావం, శాంతి భద్రతలు పెంపొందించేందుకు భారత్‌ సిద్ధంగా ఉంటుందని పేర్కొన్నారు. మరోవైపు భారత్‌లోని పాక్‌ హైకమిషనర్‌ కార్యాలయంలో ఇవాళ వేడుకలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు హాజరుకానున్నట్లు భారత విదేశాంగ అధికార ప్రతినిధి వికాస్‌ స్వరూప్‌ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com